Telangana
వాడిన వంట నూనెతో బయోడీజిల్.. మీరు కూడా అమ్ముకోవచ్చు..

వాడిన వంట నూనెతో బయోడీజిల్.. మీరు కూడా అమ్ముకోవచ్చు..
ఒకసారి వంటకు వాడిన నూనె.. మళ్లీ వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. రీ-హీట్ చేసిన నూనెల వినియోగం వల్ల.. శారీరక సమతౌల్యత దెబ్బ తింటుందని ఓ అధ్యయనం గుర్తించింది. కీలకమైన జీర్ణ వ్యవస్థ, కాలేయం, మెదడ మధ్య సమతౌల్యత ఈ ఆయిల్ దెబ్బతీస్తుందని, మొత్తంగా శారీరక విధులపైనా దీని ప్రభావం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ క్రమంలో వాడిని వంట నూనెతో బయో డీజిల్ తయారీ మొదలుపెట్టారు.
చికెన్, మటన్, వెజ్, మిర్చీలు, బజ్జీలు, గారెలు, పిండి వంటలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ వంటకానికి పెనంలో మునిగేలా నూనె ఉండాల్సిందే. ఇళ్లలో నచ్చిన బ్రాండ్ నూనెలు కొని తెచ్చుకుని వండుకుని తృప్తిగా తింటాం. మరి రెస్టారెంట్లు, హోటల్స్, తోపుడు బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎటువంటి ఆయిల్ వాడుతున్నారో మనకు తెలియదు. కొన్నిచోట్ల వాడిన నూనే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ మళ్లీ వాడిన నూనెలతో ఆహార పదార్థాలు తయారుచేస్తున్నట్టు ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కూడా గుర్తించారు.
ఇలాంటి వాడిన నూనెలతో తయారైన వంటకాలు తినడం వల్ల గుండె సమస్యలు, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ విభాగం ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందుగా పెద్ద రెస్టారెంట్ల నుంచి వినియోగించిన నూనెను ఏజెన్సీల ద్వారా సేకరించి, బయో డీజిల్ తయారీ కోసం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇది వాడిన నూనెను మళ్లీ వాడకుండా అడ్డుకుంటూ, బయో డీజిల్ తయారీ వల్ల పర్యావరణానికి మంచిది అని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో చిన్న హోటల్స్ నుంచి మొదలు ఫైవ్ స్టార్హోటళ్ల వరకు దాదాపు 60 వేలకుపైనే ఉంటాయి. వీటిల్లో 2 వేలకుపైనే పెద్ద రెస్టారెంట్లు ఉండగా.. రోజూ వంద లీటర్లకుపైనే వంట నూనె వినియోగిస్తుంటారు. వంద లీటర్ల నూనెను వంటకాలకు వినియోగిస్తే సుమారు 25 లీటర్లు మిగులు తుందనేది ఒక అంచనా. కానీ, కొన్ని రెస్టారెంట్ల వాడిన ఆయిల్ను స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, బజ్జీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు, ప్రైవేట్ ఏజెన్సీలకు అమ్ముతుంటారు. కొందరు డ్రెయిన్లలో పారబోస్తుంటారు. దీనివల్ల అన్ని విధాలుగా నష్టమే. పదేపదే వాడిన ఆయిల్తో చేసి వంటకాలను తింటే రోగాలు రావడం, డ్రెయిన్లలో పారబోయడం వల్ల మురుగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది.
వాడిన నూనెతో ఏర్పడుతున్న సమస్యలకు చెక్పెట్టడానికి ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రోజూ 50 లీటర్లకు మించి వంట నూనెను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లు తప్పనిసరిగా రుకో (రీ యూజ్డ్ కుకింగ్ ఆయిల్)లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధన విధించింది. తర్వాత, వాడిన నూనెను తప్పనిసరిగా గుర్తింపు పొందిన ఏజెన్సీలకు విక్రయించాలి.
గ్రేటర్ పరిధిలో రుకో ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీలతో ఆయిల్ సేకరిస్తున్నారు. ఏడాదిన్నర నుండి 300 కంటే ఎక్కువ రెస్టారెంట్ల నుంచి 210 టన్నుల పైగా వాడిన నూనెను సేకరించి, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని బయో డీజిల్ తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి నూనె సేకరించే సమయంలో ఏజెన్సీలు లీటర్కు రూ. 40- రూ. 45 చెల్లిస్తున్నాయి. వినియోగించిన నూనెకు డబ్బులు రాబడతాయి, అలాగే బయోడీజిల్ వల్ల పర్యావరణానికి మంచి జరుగుతుంది. ఆగమేకంగా, స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు నూనె అమ్మకం తగ్గడం వల్ల ఆహార కల్తీ కొద్దిగా తగ్గుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు.
ఎల్బీనగర్, పటాన్చెరు ఫుడ్ సేఫ్టీ అధికారులు లక్ష్మీకాంత్, భానుతేజ గౌడ మాట్లాడుతూ.. “ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం 50 లీటర్ల వంట నూనె ఉపయోగించే ప్రతీ రెస్టారెంట్ ప్రభుత్వం నుంచి రిజిస్టర్డ్ ఏజెన్సీలకు అమ్మాలి. వాటిని బయోడీజిల్ తయారీలో ఉపయోగిస్తారు. సిటీలో కొన్నిరెస్టారెంట్లు మాత్రమే మేము చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నాయి. చాలా రెస్టారెంట్ నిర్వాహకులకు దీనిపట్ల అవగాహన లేదు. వారిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు