Connect with us

Telangana

సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…అసలు టైం వచ్చేసింది.. అందరి మద్దతు కావాలి..

సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్అసలు టైం వచ్చేసింది.. అందరి మద్దతు కావాలి..

కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మత వివక్షకు స్థలం లేకపోతుందని, మతకల్లోలాలు జరగకుండా సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మిషనరీలు నడిపిస్తున్న స్కూళ్లు, ఆస్పత్రుల గురించి రేవంత్ రెడ్డి అభినందించారు. అలాగే, సమయం వచ్చింది, అందరి మద్దతు కావాలని ఆయన కోరారు. భారత సంస్కృతి చాలా గొప్పదని, తిండి, బట్టలు వంటి సహాయం కోసం మతం మారకూడదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కల్వరి టెంపుల్ పాస్టర్ డా. పి. సతీష్ కుమార్ వాక్యపరిచర్యకు 35 వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం (నవంబర్ 11న) ఎల్బీ స్టేడియంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో మత వివక్షకు చోటులేదని.. మతకల్లోలాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. భారత దేశం మత సామరస్యానికి ప్రతీక అని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేర్చేలా బాధ్యతగా పని చేస్తున్నట్టు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశంలో ప్రజాస్వామ్యమనుగడకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినట్లు గుర్తు చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అసలు సమయం వచ్చేసిందని.. ఆయనకు అందరి మద్దతు ఉండాలని రేవంత్ రెడ్డి కోరారు. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసి, తాము బాధ్యత తీసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

చెడును తొలగించి మంచిని పెంచేందుకు కృషి చేస్తున్నానని.. అందరినీ అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ సంస్కృతి చాలా బలంగా ఉందని, కులం, మతం కాని ప్రతి ఒక్కరికీ ఇక్కడ గౌరవం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. విద్య, వ్యాపారం మారిన రోజుల్లో, అతి తక్కువ ఖర్చుతో క్రిస్టియన్ మిషనరీలు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని వివరించారు క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఆదర్శప్రాయమని రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రతి పేదవాడికి సరైన వైద్యం అందించాలని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. కల్వరీ టెంపుల్‌ను ఎంతో గొప్పగా నిర్వహించడం సతీష్‌కే సాధ్యమైందని ఆయన అభినందించారు. యువత వ్యసనాలకు బానిస కావడం సమాజానికి పెద్ద నష్టం అని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ పీడను విరగడ చేసేలా సామాజిక బాధ్యతగా భక్తులకు సందేశం ఇవ్వాలని సతీష్‌ని కోరారు. డా. సతీష్ సమాజ సేవకు అంకితమై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Loading

Trending