Connect with us

Telangana

DOPTకి కీలక ఆదేశాలు.. క్యాట్‌లో ఆమ్రపాలితో సహా ఏడుగురు ఐఏఎస్‌ల పిటిషన్‌

క్యాట్‌లో ఆమ్రపాలితో సహా ఏడుగురు ఐఏఎస్‌ల పిటిషన్‌.. DOPTకి కీలక ఆదేశాలు

ఏపీ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారులు క్యాట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 4న (సోమవారం) విచారణ జరిగింది. డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తున్న ఆమ్రపాలి కాటా సహా ఏడుగురు ఐఏఎస్‌లు క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై డీఓపీటీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదు.  దీంతో, డీఓపీటీకి క్యాట్ ఏడుగురికి వేర్వేరుగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా.. తదుపరి విచారణను నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది క్యాట్.

తెలంగాణలో విధులు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు.. డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై క్యాట్ సోమవారం (నవంబర్ 04న) విచారించింది. ఏడుగురు ఐఏఎస్‌లు పిటిషన్ దాఖలు చేయగా, దీని మీద డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) నుంచి కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో, ఈ ఏడుగురు ఐఏఎస్‌లకు వేర్వేరుగా కౌంటర్ దాఖలు చేయాలని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాదులు క్యాట్‌ను కోరారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన క్యాట్, ఆమ్రపాలి సహా ఏడుగురు ఐఏఎస్‌లను ఏపీకి కేటాయించిన విషయం మీద విడిగా కౌంటర్లు దాఖలు చేయాలని డీఓపీటీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇంతకుముందు, డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేసిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డీవోపీటీ ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‎లు దాఖలు చేసిన పిటిషన్లను క్యాట్ తోసిపుచ్చింది. డీఓపీటీ ఆదేశాలను అనుసరించాల్సిందేనని ఐఏఎస్‌లకు స్పష్టం చేసింది. డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా ఏ రాష్ట్రానికి చెందిన కేడర్ అధికారులైతే, వారు ఆ రాష్ట్రానికి వెళ్లి రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. ఐఏఎస్ అధికారుల పిటిషన్‎పై విచారణ సందర్భంగా.. క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని.. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని లేదా అంటూ ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించింది. దేశ సరిహద్దుల్లో సమస్యలు వస్తే అక్కడి వెళ్లరా అని ప్రశ్నించిన క్యాట్.. ఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా అంటూ అధికారులను నిలదీసింది.

డీవోపీటీ వన్ మ్యాన్ కమిటీని వేసినప్పుడు ఎందుకు స్పందించలేదని.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ఐఏఎస్‎లను క్యాట్ ప్రశ్నించింది. ఐఏఎస్‎ల కేడర్ కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అధికారం డీవోపీటీకి ఉందని క్యాట్ గుర్తు చేసింది. ఇరువర్గాల వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించిన క్యాట్.. ఎక్కడ కేడర్ అధికారులు అక్కడికి వెళ్లాల్సిందేనని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు డీఓపీటీకి కీలక ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. క్యాట్ ఆదేశాలకు అనుగుణంగా.. ఐఏఎస్ అధికారులు ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. అందులో ఆమ్రపాలి కాటాకు.. ఏపీ టూరిజం ఎండీగా ప్రభుత్వం బాధ్యతలు కూడా అప్పగించింది.

Loading

Advertisement

Trending