Connect with us

Telangana

హైదరాబాద్ నగరవాసులు ఇప్పుడు డేంజర్ జోన్‌లో.. ఇలా అయితే బతకటం కష్టం

హైదరాబాద్ నగరవాసులు ఇప్పుడు డేంజర్ జోన్‌లో.. ఇలా అయితే బతకటం కష్టం

హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పెరిగిపోతుంది. నగరంలో వెంటనే గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఢిల్లీ లాంటి పరిస్థితులు నగరంలో కూడా ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. నగరంలో జీవించడం కూడా కష్టంగా మారవచ్చు.

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు వాయు కాలుష్యంతో బాధపడుతున్నారు. అక్కడ గత కొన్ని రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300కి పైగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తీవ్రమైన కాలుష్యంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చడానికి ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్నట్లు అర్థమవుతోంది. గత వారం వరకు హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో లేదు. కానీ, గత రెండు మూడు రోజులుగా నగరంలో కాలుష్యం బాగా పెరిగింది. గత మూడు రోజుల్లో నగరంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. భారీగా బాణసంచా కాల్చడమే దీనికి కారణంగా వివరిస్తున్నారు. వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాయు కాలుష్యం 10 శాతం పెరిగింది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-50 ఉంటే మంచి గాలిగా, 51-100 మధ్య ఉంటే మితమైన గాలిగా, 101-150 మధ్య ఉంటే అనారోగ్యకరమైన గాలిగా పరిగణించబడుతుంది. హైదరాబాద్‌లో ఆదివారం నాటి రియల్ టైమ్ ఇండెక్స్ చూసిట్లయితే యూఎస్ కాన్సులేట్ సమీపంలో AQI 159, సనత్‌నగర్ 134, ఇక్రిసాట్-పటాన్‌చెరు 131గా ఉంది.

బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, ఐడీఏ జీడిమెట్లలోనూ విపరీతమైన గాలి కాలుశ్యం నమోదైంది ఇక్కడ పంట పొలాల వ్యర్థాలు లేకపోయినా, పరిశ్రమల నుంచి వచ్చే విష రసాయనాలు, నగర శివారులో తగులబెట్టే చెత్త, వాహనాల పొగ కారణంగా గాలి కాలుష్యం పెరుగుతుందని చెబుతున్నారు. గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా శ్వాసకోశానికి హాని కలిగిస్తుందని వారు అంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.. అక్కడి వాహనాలతో పాటుగా పంజాబ్, హర్యానాలో రైతులు తగులబెట్టే పంట వ్యర్థాలు. హైదరాబాద్ నగరంలోనూ దాదాపు అదే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పంట పొలాల వ్యర్థాలు లేకపోయినా, పరిశ్రమల నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు, నగర శివారులో తగులబెట్టే చెత్త, వాహనాల పొగ వల్ల గాలి కాలుష్యం పెరుగుతుందని చెబుతున్నారు.

Advertisement

గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థకు ఎక్కువ హాని కలిగిస్తుందని వారు అంటున్నారు. ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), దగ్గు, శ్వాసలోపం, ఛాతీ బిగుతు వంటి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటుకు సైతం వాయు కాలుష్యం కారణం అవుతుందని చెబుతున్నారు. వాయు కాలుష్యం ప్రధానంగా చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. పిల్లల్లో ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Loading

Trending