Telangana
మూసీ నిర్వాసితులకు రూ. కోటి విలువైన ఇంటి స్థలం.. సర్కార్ ముఖ్యమైన నిర్ణయం..

మూసీ పునరుజ్జీవంలో భాగంగా నదీ పరిహహక ప్రాంతంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలను సరైన విధంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నది ఒడ్డున ఉన్న పలువురు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు. ఇక బఫర్ జోన్లో ఇండ్లు కోల్పోయిన వారికి హైదరాబాద్ సమీపంలో ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరికి రూ.కోటి విలువైన స్థలాలను కేటాయించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నదికి పునరుజ్జీవనం తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ పరివాహకప్రాంతాల్లోని అక్రమణలను తొలగిస్తోంది. రివర్ బెడ్ ప్రాంతంలోని ఇండ్లను కూల్చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక బాధితులుగా మారుతున్న మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారికి సరైన పరిహారం ఇచ్చి, ఒప్పించిన తర్వాత మాత్రమే ఖాళీ చేయించాలని సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా.. ఒక్కొక్కరికి 150-200 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో ఉంటున్న వారితో పాటుగా.. 50 మీటర్ల బఫర్ జోన్లోని వారి ఇండ్లు, దుకాణాలు కూల్చేయాల్సి ఉంది. మూసీ రివర్ బెడ్లో ఉన్న 1600 మందిలో దాదాపు 1200 మంది ఇండ్లను ఖాళీ చేసి ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి వెళ్లడానికి తమ అంగీకారం తెలిపారు. రూడు. 25,000 చొప్పున నగదు, ఉపాధి కోసం రూ. 2 లక్షల లోన్లు ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పటికే 250 ఇండ్లను ఖాళీ చేసి మంది వెళ్లిపోయారు. అయితే బఫర్ జోన్లో ఉన్నవారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలాదని వారు ఖాళీ చేయడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ విషయంపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి రంగంలోకి దిగి సీఎంతో చర్చలు జరిపారట. బఫర్ జోన్లోని నిర్వాసితులకు హైదరాబాద్ సమీపంలో ఇండ్ల స్థలాలను ఇస్తే బాగుంటుందని చెప్పారట. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూసీ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో చెప్పారు. వారికి ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల కోసం 650-800 ఎకరాలు అవసరమని అధికారులు ముందే గుర్తించారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు