Connect with us

Telangana

రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని ఓ మహిళ మృతి చెందగా 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం

రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని ఓ మహిళ మృతి చెందగా 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం

చికెన్ మోమోస్ తినడంతో ఓ మహిళ చనిపోవడంతో పాటు దాదాపు 50 మంది అనారోగ్యానికి గురైన సంఘటన మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మల్‌లోని ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని ఓ మహిళ మృతి చెందగా.. అదే హోటల్‌లో భోజనం చేసిన సుమారు 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి వచ్చి హోటల్‌పై కేసు పెట్టి సీజ్ చేసినట్లు సమాచారం.

ఇటీవలే హైదరాబాద్‌లోని నందినగర్‌ పరిధిలో నిర్వహించిన వీక్లీ మార్కెట్‌లో మోమోస్ తిని ఓ మహిళా చనిపోగా.. సుమారు 50 మంది అస్వస్థతకు గురైన విషయం మర్చిపోక ముందే.. మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో.. చికెన్ బిర్యానీ తిని ఓ యువతి ప్రాణాలు వదలగా.. సుమారు 20 మంది అస్వస్థతకు గురవటం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. బోథ్ మండల కేంద్రంలో ఉన్న సెయింట్ థామస్ స్కూల్ సిబ్బంది అంతా కలిసి నిర్మల్‌లోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేశారు. అక్కడ చికెన్ బిర్యానీ తిన్న బైగా అనే యువతి తీవ్రమైన అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే హోటల్లో నవంబర్ 4న సోమవారం రాత్రి భోజనం చేసిన 20 మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో, వారు వెంటనే వచ్చి హోటల్‌ను తనిఖీ చేసి సీజ్ చేశారు.

ఈ హోటల్లో మండీ బిర్యానీ తిన్న పలువురికి కూడా ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్నారు. గ్రిల్ హోటల్లో ఆదివారం రాత్రి ఖానాపూర్కు చెందిన కొందరు యువకులతో పాటు నిర్మల్కు చెందిన అస్లాం, హుస్సేన్, షేక్ బాబా, షేక్ జాకీర్, సైఫ్ మండీ చికెన్ బిర్యానీ తిన్నారు. ఈ మండీ బిర్యానీ తిన్న 13 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరు సోమవారం మధ్యాహ్నం కోలుకోగా, మరికొందరు ఇంకా చికిత్స పొందుతున్నారు. చికెన్ బిర్యానీ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్టు బాధితులు, వైద్యులు తెలిపారు.

కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని..

మరోవైపు.. నాగర్ కర్నూల్ జిల్లాలో కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని ఓ వృద్ధులు ప్రాణాలు విడిచిన ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌‌ గ్రామానికి చెందిన తిరుపతయ్య(60) ఆదివారం (నంబర్ 3న) లింగాలలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి అప్పాయిపల్లిలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లడానికి లింగాల బస్టాండ్‌కి వచ్చినాడు. ఆకలి వేసింది కాబట్టి అక్కడే ఉన్న బజ్జీల బండి వద్ద ఎగ్ బజ్జీ కొనుక్కున్నాడు. అది తింటుండగా గుడ్డు అనుకోకుండా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక తిరుపతయ్య అక్కడే కుప్పకూలిపోయాడు.

Advertisement

Loading

Trending