Connect with us

Telangana

యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు..

యూట్యూబర్‌ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. అడ్వొకేట్‌తో సహా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి…హర్షసాయితో పాటు అతడి తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు.

బాధిత యువతి హర్షసాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. యువతికి సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో హర్షసాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించినట్లు సమాచారం. బాధిత యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా అని తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు ప్రకటించారు.

అయితే ఈ రేప్‌ కేసుపై యూట్యూబర్‌ హర్షసాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు.. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి అని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్‌ సమాధానం చెబుతారని వెల్లడించాడు. మరోవైపు పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్‌ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు.

Loading

Advertisement

Trending