Connect with us

Entertainment

ఎవరు ఆకలితో ఉన్నా సరే నా రెస్టారెంట్ కి రండి.. సందీప్ కిషన్‌ ట్వీట్‌..

సందీప్ కిషన్ ప్రస్తుతం హిట్ల మీదున్నాడు. ఊరిపేరు భైరవకోన అంటూ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్‌గా ధనుష్ రాయన్ సినిమాలో మంచి పాత్రను వేసి తమిళ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకున్నాడు. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్‌ ఆడియెన్స్‌లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక సందీప్ కిషన్ అయితే అటు సినిమాలు, ఇటు వ్యాపారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక సందీప్ కిషన్ లవర్ బాయ్‌గా అతని మీద వచ్చే రూమర్ల గురించి అందరికీ తెలిసిందే.

సందీప్ కిషన్ తన వివాహా భోజనంబు రెస్టారెంట్‌ ద్వార ఆకలితో ఉన్న వారి కడుపు నింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రతిరోజూ వందల మందికి ఉచితంగా ఫుడ్‌ను పంపిస్తాను అని సందీప్ కిషన్ చెప్పిన మాటలు.. నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరోసారి సందీప్ కిషన్ తన వివాహా భోజనంబు టీం చేస్తున్న సేవ గురించి ట్వీట్ చేసాడు.

ఫుడ్ వ్యాన్ ద్వారా సిటీలోని పలు చోట్ల ఉచితంగా ఫుడ్ ప్యాకెట్‌లను తన టీం పంచుతున్నారట. ఇదే విషయాన్ని సందీప్ కిషన్ ట్వీట్ రూపంలో వేశాడు. వివాహా భోజనంబు టీం చేస్తున్న నిర్విరామ కృషికి థాంక్స్.. మీకు తెలిసిన వాళ్లు ఆకలితో బాధపడుతుంటే మాకు చెప్పండి.. దగ్గర్లో ఉన్న వివాహా భోజనంబుకి వెళ్లండి.. ఫుడ్ ప్యాకెట్లు తీసుకోండి.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి అంటూ సందీప్ కిషన్ ట్వీట్ వేశాడు.

ఇక సందీప్ కిషన్ వేసిన ట్వీట్‌కు బీవీఎస్ రవి స్పందించాడు. వివాహా భోజనంబులో మీ హాస్పిటాలిటీ, ఫుడ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి.. నువ్వు చేసే సర్విస్ ఇంకా చాల బాగుంది.. త్వరలోనే తిరుపతి బ్రాంచ్‌కి వెళ్లాలని అనుకుంటున్నా అని బీవీఎస్ రవి ట్వీట్ చేసాడు. దీనికి థాంక్యూ సో మచ్ అన్నా అంటూ సందీప్ కిషన్ రిప్లై ఇచ్చాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం మాయా వన్ అనే మూవీతో పలకరించబోతోన్నాడు. అదే టైంలో త్రినాథరావు నక్కినతో మరో లవ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని చేస్తున్నాడు.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending