Connect with us

Latest Updates

అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువును సగానికి సగం తగ్గించిన రైల్వే బోర్డు..

ట్రైన్ టిక్కెట్ల రిజర్వేషన్‌ను 120 రోజుల ముందస్తు బుకింగ్ గడువును 60 రోజులకు కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.తాజాగా, దీనిపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. టిక్కెట్ రిజర్వేషన్ల గడువు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సిలేషన్లు ఎక్కువుగా అవుతుండటం వల్ల బెర్తులు వృథా అవుతున్నాయని తెలిపింది. అంతేకాదు, పలు రకాల మోసాలు, రైల్వే అధికారుల అక్రమాలకు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది.వీటిని ఆపేందుకు ముందస్తు బుకింగ్‌ గడువును కుదించాల్సి వచ్చిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ముందస్తు రిజర్వేషన్లకు 120 రోజుల గడువు ఉండటంతో క్యాన్సిలేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ప్రస్తుతం 21 శాతం ఉందని, టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిలో 4-5 శాతం మంది మాత్రమే ప్రయాణం చేయడం లేదని తెలిపారు.అలాంటి వారు టికెట్‌ రద్దు చేసుకోకపోవడంతో సీట్లు/ బెర్తులు వృథాగా పోతున్నాయి.. ఇది పలు రకాల మోసాలు, రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు వంటి ఘటనలకు కారణమవుతోంది. ప్రస్తుత నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చు’ అని రైల్వే బోర్డు వెల్లడించింది.

దీంతోపాటు, గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ముందుగా సీట్లు బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. గడువు తక్కువగా ఉంటే అసలు ప్రయాణికులకు సీట్లు దొరికే అవకాశం ఎక్కువ ఉంటుందని రైల్వే తెలిపింది.తక్కువ సంఖ్యలో క్యాన్సిలేషన్లు, ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడానికి రైల్వేశాఖకు అవకాశం ఉంటుందని పేర్కొంది.

అడ్వాన్స్‌డ్ బుకింగ్‌ గడువులో కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయని రైల్వే బోర్డు పేర్కొంది.ముందస్తు బుకింగ్ గడువు గతంలో 30 నుంచి 120 రోజులు ఉండేదని, అనుభవాల ఆధారంగా 60 రోజుల సమయం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే పేర్కొంది. ఏప్రిల్ 1981 నుంచి ఏప్రిల్ 2015 వరకు 12 సార్లు మార్పులు చేసిన విషయాన్ని కూడా గుర్తుచేసింది.

ముందస్తు రిజర్వేషన్ గడువు 120 నుంచి 60 రోజులకు తగ్గించిన నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు జనరల్ క్లాస్ టిక్కెట్లపై ఎటువంటి ప్రభావం ఉండదని రైల్వే బోర్డు పేర్కొంది, ఎందుకంటే వీటిని రైలు బయలుదేరే ముందు స్టేషన్‌లోనే తీసుకుంటారు. 120 రోజుల ముందే టిక్కెట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితిపై కూడా రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టికెట్ బుకింగ్ చేసుకున్న వారిని ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వారి రిజర్వేషన్ ప్రకారం బెర్తుల కేటాయింపు ఉంటుందని ఎక్స్ ద్వారా సమాచారం ఇచ్చింది.

Advertisement

Loading

Trending