Latest Updates
మెక్డొనాల్డ్స్లో ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి.. పది మందికిపైగా అస్వస్థత

మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మరణించగా, పలువురు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్ తిన్న ఒకరు ఈ.కోలి బ్యాక్టీరియా వల్ల మరణించారని, పది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. వీరు తిన్న ఆహారంలో ఈ.కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబరు చివరి వారంలో వ్యాప్తి ప్రారంభమై, 10 పశ్చిమ రాష్ట్రాల్లో, ముఖ్యంగా కొలరాడో, నెబ్రాస్కాలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.
సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హెమోలైటిక్ ఉర్మెక్ సిండ్రోమ్తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్డొనాల్డ్స్లో ఆహారం తీసుకున్నారని తెలిపింది,
వీరి అనారోగ్యానికి కారణమయ్యే ఖచ్చితమైన పదార్ధాన్ని ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్ల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని పక్కనబెట్టాయి.‘నాకు మరియు మెక్డొనాల్డ్స్లో ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ చెప్పారు. ఆయన ఒక వీడియో సందేశంలో, ‘మేము ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మా ఔట్లెట్లలో ఉల్లిపాయ ముక్కలు ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించారు.
పెద్ద సంఖ్యలో రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సీడీసీ సూచన ప్రకారం, క్వార్టర్ పౌండర్లో ఆహారం తిన్న తర్వాత డయోరియా, తీవ్రమైన జ్వరం వంటి ఈ-కోలి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. చాలా ఏడు రోజుల్లోపే ఎటువంటి చికిత్స లేకుండా కోలుకుంటారు. కొంత మందికి మాత్రం పరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. ఈ ఏడాది జనవరిలో, బ్యాక్టీరియా ఉందనే భయంతో అమెరికాలో మాంసం అమ్మే ఒక కంపెనీ దాదాపు 3,000 కిలోల మాంసాన్ని మార్కెట్ నుంచి తిరిగి వెనక్కి రప్పించింది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు