Telangana
ration cards :తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక అప్డేట్..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక అప్డేట్, దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..?
తెలంగాణ కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండగా.. వారికి గుడ్న్యూ్స్ చెప్పారు. అక్టోబర్ తొలివారంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటంతో కుటుంబాలు వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా..? అని కళ్లల్లో వత్తులేసుకుని చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండటంతో రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం గుడ్న్యూస్ చెప్పింది. అక్టోబర్లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డులతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను కూడా ఇస్తామని చెప్పింది.
తాజాగా. కొత్త రేషన్ కార్డుల మంజూరుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. అక్టోబరు మొదటివారంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గాంధీభవన్లో శుక్రవారం (సెప్టెంబర్ 27) నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులకు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చినవారితో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రత్యేక సమావేశాల్లోనే పెట్టుకోవాలని వారికి సూచించారు. గాంధీ భవన్లోనూ దరఖాస్తులు తీసుకుంటామని.. ఆ తర్వాత వాటిని ఆయా శాఖల మంత్రులకు, ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు.
కాగా, ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై తుది ప్రక్రియ మరో రెండు మూడ్రోజుల్లో పూర్తి కానుంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించి విధి విధానాలు ఖరారు కానున్నాయి. అక్టోబర్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిచనున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు