Connect with us

Andhra Pradesh

ఒకసారి తప్పించుకున్నాడు.. కానీ కొన్ని నిమిషాల్లోనే రెండోసారి చావు తప్పలేదు

శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే, యువకుడు రైలుకు కిందకు దూకడానికి ప్రయత్నించగా, అతడిని తోటి ప్రయాణికులు కాపాడారు. కానీ మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో, సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులోని యువకుడు, పలాస రైల్వే స్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్నప్పుడు, ప్లాట్‌ఫామ్ నుంచి ట్రైన్‌ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు.వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు.

ఆ ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయం వచ్చింది. వెంటనే జీఆర్పీ పోలీసులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అంతలో బెంగళూరు నుంచి అసోం వెళ్ళుతున్న కామాఖ్య సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది. ఆ యువకుడు జీఆర్పీ సిబ్బందిని తోసేసి, రైలుకు ముందుకు దూకాడు. పాపం రైలు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మొదట గాయపడిన సమయంలో ఆ యువకుడు హిందీలో కేకలు వేసి చచ్చిపోతున్నట్లు స్టేషన్‌లో ఉన్నవాళ్లు చెబుతున్నారు. తనకు ఎవరూ లేరు.. ఎవరి కోసం బతకాలి.. తనకు ఎందుకు వైద్యం చేయడానికి తీసుకెళ్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఈ ప్రమాదం కారణంగా కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట పాటు పలాస రైల్వేస్టేషన్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మొదటిసారి ప్రాణాలు తీసుకునేంద ప్రయత్నించగా.. ప్రయాణికులు కాపాడారు. కానీ రెండోసారి మాత్రం మరణాన్ని తప్పించుకోలేకపోయాడు.

మరోవైపు సంతబొమ్మాళి మండలం తెనిగపెంటలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపిందిఈ నెల 6న గ్రామంలోని పాఠశాల సమీపంలోని బావిలో రేవతి మృతదేహం కనిపించింది. రేవతికి అదే గ్రామానికి చెందిన పెంట లక్ష్మయ్యతో గత ఏడాది వివాహమైంది. కానీ, ఈ నెల 4న అర్ధరాత్రి లక్ష్మయ్య మరియు కుటుంబ సభ్యులు రేవతి కనిపించడం లేదని ఆమె పిన్నికి చెప్పారు. అందరూ కలిసి ఆమెను గాలించారు, కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. వెంటనే సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు, అప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేసారు.6వ తేదీ ఉదయం పాఠశాల సమీపంలో ఉన్న బావి వద్దకు తాగునీరుకు వెళ్లిన స్థానికులు మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కంచిలి మండలం పద్మతులలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పులి లక్ష్మీనారాయణ, అరుణకుమారి భార్యాభర్తలు.క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న నారాయణ మద్యానికి బానిసగా మారి, తన భార్యను వేధిస్తుండేవాడు. మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి ఇంటి పెరట్లోకి వెళ్లి శరీరంపై డీజిల్‌ పోసుకుని ఆత్యహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన సోంపేట ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం బ్రహ్మపుర తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో చనిపోయింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Loading

Trending