Connect with us

Latest Updates

ఇజ్రాయేల్‌పై ప్రతీకారం తీసుకోవాలని ఉద్దేశించి రూటు మార్చిన ఇరాన్.. ఈసారి అక్కడ నుంచే ప్రణాళికలు చేస్తోంది! 

ఇజ్రాయేల్పై ప్రతీకారం తీసుకోవాలని ఉద్దేశించి రూటు మార్చిన ఇరాన్.. ఈసారి అక్కడ నుంచే ప్రణాళికలు చేస్తోంది! 

హమాస్ మరియు ఇజ్రాయేల్ మధ్య యుద్ధం క్రమంగా పెరిగి అంతర్జాతీయ సమాజానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఓవైపు రష్యాఉక్రెయిన్ మధ్య దాదాపు మూడేళ్లుగా యుద్ధం సాగుతుంటేఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇరాన్, ఇజ్రాయేల్ సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాలు వెంటాడుతున్నాయి. క్రమంలో ఇజ్రాయేల్పై మరోసారి దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. 

 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా.. పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇటీవల ఇజ్రాయేల్తమపై చేసిన దాడులతో రగిలిపోతోన్న ఇరాన్‌.. మరోసారి ప్రతీకార దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దాడులు తమ గడ్డపై నుంచి కాకుండా ఇరాక్ నుంచి చేయాలని టెహ్రాన్ ప్లాన్ చేసిందని ఇజ్రాయేల్ నిఘా వర్గాలు చెప్పాయి. నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి, అందుకుముందు దాడులు జరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున డ్రోన్లు మరియు బాలిస్టిక్ మిస్సైల్స్ ఉపయోగించడానికి ఇరాన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు యాక్సియోస్ రిపోర్టు తెలిపింది. 

 ఇరాక్లోని ఇరాన్అనుకూల మిలిటెంట్ల ద్వారా దాడి నిర్వహించేందుకు దేశం సిద్ధమవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇజ్రాయేల్మరోసారి ప్రతీకార చర్యలు చేపట్టకుండా దేశంపై భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. సందర్భంలో, ఇజ్రాయేల్పై ప్రతిదాడికి సిద్ధం కావాలని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేని తన సైనికులను ఆదేశించినట్లు ఒక వార్తా సంస్థ కథనం చెప్పింది. ఇటీవల ఇజ్రాయేల్జరిపిన దాడుల్లో జరిగిన నష్టం, ప్రతిదాడికి సంబంధించి ఇరాన్ అధికారులు చర్చలు నిర్వహించినట్లు సమాచారం. సందర్భంలో ఇజ్రాయెల్పై దాడికి సిద్ధం కావాలని అలీ ఖమేనీ తన సైనిక అధికారులను ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. 

 ఇందులోభాగంగా టెహ్రాన్దళాలు టెల్అవీవ్కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. హమాస్చీఫ్ ఇస్మాయెల్హనీయా, హెజ్బొల్లా చీఫ్సయ్యద్హసన్నస్రల్లా, ఇరాన్రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన నిల్పోరూషన్మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అక్టోబరు 1 టెల్అవీవ్పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతిగా, ఇజ్రాయేల్ ఇరాన్ సైనిక స్థావరాలు మరియు క్షిపణి తయారీ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. 

Advertisement

దాడుల్లో టెహ్రాన్కు చెందిన నాలుగు సైనికులు చనిపోయారు, క్షిపణి నిర్వహణ కేంద్రాలు పూర్తిగా నాశనం అయ్యాయి. దాడులను ఇరాన్ తీవ్రంగా తీసుకుంటోంది. అయితే, సమస్యను తీవ్రతరం చేయకండి, ఇంతటితో ముగించండి అని అమెరికా మరియు మరికొన్ని దేశాలు ఇరాన్కు సూచించాయి. మరోవైపు, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయేల్పై ఇరాన్ ప్రతిదాడి చేస్తోందని ఇటీవల అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించడం ఆందోళనకు గురిచేస్తోంది. పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Loading

Trending