Latest Updates
గోడకు అతికించిన అరటిపండుకు రూ.52 కోట్లు.. అలా ఎందుకు, అది ఏమిటి అనేదే తెలుసా?

గోడకు అతికించిన అరటిపండుకు రూ.52 కోట్లు.. అలా ఎందుకు, అది ఏమిటి అనేదే తెలుసా?
గోడకు అంటించిన ఒక అరటిపండుకు రూ.52 కోట్లు ఇవ్వడం మీరు నమ్మగలరా? అవును, ఒక అరటిపండుకు అంత ధనం పెట్టి కొన్నారట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఒక అరటిపండును వేలంలో పెట్టగా, ఒక వ్యక్తి దాన్ని రూ.52 కోట్లకు కొనేశాడు. ఆ అరటిపండుకు ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత డబ్బు పెట్టి కొనుగోలు చేశారు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మార్కెట్లో డజన్ అరటిపండ్లు రూ.50 నుంచి రూ.70 మధ్య దొరుకుతాయి. కానీ ఈ అరటిపండు ధర ఏకంగా రూ.52 కోట్లు. పైగా, దీన్ని వేలంలో పోటీ పడి కొన్నది ప్రత్యేకం. గోడకు అంటించిన ఈ అరటిపండు కోసం నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి రూ.52 కోట్లు పెట్టి కొన్నాడు. ఇది ఇప్పుడు అన్ని చోట్ల చర్చగా మారింది. ఈ బనానా ఆర్ట్ వర్క్ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో రూ.52 కోట్లు పలికింది. ఈ బనానా టేప్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఈ అరటిపండుకు ఏం ప్రత్యేకత ఉంది?
బనానా టేప్ మరొకసారి వార్తల్లో వచ్చి పెద్ద చర్చకు దారి తీసింది. ఈసారి, ఈ బనానా టేప్ వేలంలో 52 కోట్ల రూపాయలుగా అమ్ముడైంది. కమెడియన్గా పిలిచే బనానా ఆర్ట్ వర్క్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ బనానా టేప్ను ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించాడు. సోథ్బే అనే సంస్థ న్యూయార్క్లో ఈ ఆర్ట్ వర్క్ను వేలం పెట్టింది. ఈ వేలంలో క్రిప్టోకరెన్సీ ఫౌండర్ జస్టిన్ సన్ రూ.52 కోట్లకు ఆ బనానా టేప్ను కొనుగోలు చేశారు. 2019లో మొదటిసారి మియామి బీచ్ ఆర్ట్ బాసెల్లో ఈ అరటిపండు ఆర్ట్ వర్క్ ప్రదర్శించారు. గోడకు అరటిపండు పెట్టి, దాన్ని టేప్తో అంటించి ఉంచుతారు. ఈ ఆర్ట్ వర్క్లో ప్రతి 3 రోజులకు ఒకసారి గోడపై ఉన్న అరటిపండును మార్చుతారు. దీంతో అప్పటి నుంచి ఈ బనానా టేప్ను ఒక కళాఖండం అని భావించాలా అనే ప్రశ్న చర్చనీయాంశం అయింది.
2019లో ఆ బనానా టేప్ను వేలంలో పెట్టగా, చాలా ఎక్కువ ధరకు అమ్ముడైంది. 5 సంవత్సరాల క్రితం జరిగిన ఆ వేలంలో ఆ బనానా టేప్ 1.20 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది, అంటే మన కరెన్సీలో సుమారు రూ.98 లక్షలు. ఆ తర్వాత కూడా అదే ధరకు మరొక బనానా టేప్ను విక్రయించారు. తర్వాత, దీన్ని తయారు చేసిన ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ ఆ బనానా టేప్ ధరను పెంచేశారు. అందులో భాగంగా, తాజాగా నిర్వహించిన వేలంలో ఆ బనానా టేప్ 6.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది, అంటే మన కరెన్సీలో సుమారు రూ.52 కోట్లు. ఈ ధర అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ బనానా టేప్ కేవలం ఒక ఆర్ట్ వర్క్ మాత్రమే కాదు అని, దీన్ని వేలం వేసిన సోథ్ బే సంస్థ చెప్పింది. ఈ బనానా టేప్ ఆర్ట్, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వంటివి కలిసిన ప్రపంచాలను చూపిస్తుందని వాళ్లు పేర్కొన్నారు. అలాగే, ఈ బనానా టేప్ భవిష్యత్తులో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుందని, దీన్ని కొనుగోలు చేసిన బిట్ కాయిన్ ఫౌండర్ జస్టిన్ సన్ చెప్పారు. ఇంకా, “ద ఎంపైర్ ఆఫ్ లైట్” అనే పెయింటింగ్ను న్యూయార్క్లోని క్రిస్టీస్ వేలంలో ఉంచగా, అది 121 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో ఆ ధర సుమారు రూ.1021 కోట్లు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు