Connect with us

Latest Updates

ఐఫోన్ 16: యాపిల్ కంపెనీ రూ.850 కోట్ల భారీ ఆఫర్.. నిషేధం తొలగించమని అభ్యర్థన!

ఐఫోన్ 16: యాపిల్ కంపెనీ రూ.850 కోట్ల భారీ ఆఫర్.. నిషేధం తొలగించమని అభ్యర్థన!

iPhone 16: యాపిల్ కంపెనీ ఇండోనేషియా ప్రభుత్వానికి బంపరాఫర్ ఇచ్చింది. ఆ దేశంలో ఏకంగా 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు తెలిపింది. గతంలో ఇండోనేషియాలో పెట్టుబడి పెడతామని చెప్పి.. దానికి యాపిల్ కంపెనీ కట్టుబడి ఉండకపోవడంతో.. ఆ కంపెనీ తయారు చేసిన ఐఫోన్ 16ఫోన్ల వాడకం, విక్రయాన్ని ఇండోనేషియా ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా యాపిల్ కంపెనీ దిద్దుబాటు చర్యలు తీసుకొని, ఇండోనేషియాలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తోంది.

ఐఫోన్ 16: ఇండోనేషియా ప్రభుత్వం యాపిల్ కంపెనీపై వేసిన ఆంక్షల కారణంగా, ఆ కంపెనీ చర్యలు తీసుకుంది. తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెడతామని చెప్పి హామీ ఇచ్చిన యాపిల్ కంపెనీ.. ఆ మేరకు పెట్టుబడులు పెట్టడంలో విఫలం కావడంతో ఇండోనేషియా ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంది. యాపిల్ కంపెనీ కొన్ని నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ఐఫోన్ 16 మోడల్ ఫోన్లను ఇండోనేషియాలో విక్రయించడం, వాడటాన్ని రద్దు చేసింది. ఇతర దేశాల నుంచి ఫోన్ కొనుగోలు చేసిన వారు, టూరిస్ట్‌లు కూడా ఇండోనేషియాలో ఐఫోన్ 16 ఉపయోగించకూడదని కఠినమైన ఆంక్షలు విధించారు. దీని కారణంగా, యాపిల్ కంపెనీ ఇండోనేషియా ప్రభుత్వానికి ఒక ఒప్పందం పెట్టింది. ఇండోనేషియాలో 100 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.850 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆఫర్ ఇచ్చింది.

ఆగ్నేయ ఆసియాలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండోనేషియాలో, రాబోయే 2 ఏళ్లలో యాపిల్ కంపెనీ సుమారు రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు చేస్తోంది. ఇది గతంలో పెట్టిన రూ.85 కోట్ల పెట్టుబడి కంటే పది రెట్లు ఎక్కువ కావడం ప్రత్యేకం. ఇప్పటికే ఇండోనేషియా రాజధాని జకర్తాకు ఆగ్నేయంగా ఉన్న బాండూంగ్ నగరంలోని ఓ ఫ్యాక్టరీలో యాక్సెసరీస్, స్పేర్ పార్ట్స్ తయారీ కోసం రూ.85కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచించింది.

దీని పరిణామంలో, యాపిల్ కంపెనీ భారీ పెట్టుబడులు పెడతామని చెప్పిన ఆఫర్‌ను ఇండోనేషియా పరిశ్రమ శాఖకు పంపింది. కానీ, తాజాగా ఇండోనేషియా కొత్త డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం.ఇండోనేషియాలోనే యాపిల్ ఫోన్ల పరిశోధనలు, తయారీపై మరింత దృష్టిపెట్టారని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే యాపిల్ కంపెనీ ఇచ్చిన భారీ పెట్టుబడి ఆఫర్‌పై ఇండోనేషియా ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక యాపిల్ కంపెనీ తీసుకువచ్చిన మొదటి ఆఫర్ సమయంలో.. మంత్రి అగస్ గుమివాంగ్ కర్తాసస్మితను కలవాలని సంబంధిత మంత్రిత్వ శాఖ యాపిల్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు సూచించింది. వారు జకర్తాకు వెళ్లినప్పుడు, మంత్రి అందుబాటులో లేరని చెప్పడంతో, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌ను కలవాలని అక్కడి అధికారులు సూచించినట్లు తెలిసింది. అయితే దీనిపై అటు మంత్రిత్వశాఖ గానీ, యాపిల్ కంపెనీ గానీ స్పందించలేదు.

ఇండోనేషియాలో మౌలిక సదుపాయాలు, ఇతర వాటి కోసం సుమారు 109 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.900 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని యాపిల్‌ కంపెనీ హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన మాటను కాదని కేవలం 1.48 మిలియన్‌ ఇండోనేషియా రూపాయలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.800 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టింది. దీంతో ఇండోనేషియా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఐఫోన్ 16 మోడల్ ఫోన్లపై నిషేధం విధించింది. ఈ నిషేధం తొలగించేందుకు, యాపిల్ కంపెనీ పెట్టుబడిని 10 రెట్లు పెంచాలని ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending