Latest Updates
శబరిమల ఆలయంలో భారీ ఆదాయం పొందింది. గత సీజన్ రికార్డు బ్రేక్ అయ్యింది.

శబరిమల ఆలయంలో భారీ ఆదాయం పొందింది. గత సీజన్ రికార్డు బ్రేక్ అయ్యింది.
శబరిమలలో మండల పూజలు వైభవంగా జరుగుతున్నాయి. రెండు నెలల యాత్రా సీజన్లో లక్షలాది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 22న ఒక రోజు మొత్తం 87,186 మంది స్వామిని దర్శించుకున్నారు. శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. అందువల్ల, భక్తులను నియంత్రించేందుకు మరకుట్ట సమీపంలో మూడు చోట్ల ఆంక్షలు విధించారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో నవంబర్ 16 నుంచి మండల మకర విళక్కు సీజన్ మొదలైంది. స్వామి దర్శనం కోసం భక్తులు వస్తూ శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మొదటి నాలుగు రోజుల తర్వాత శుక్రవారం నుంచి రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో భక్తులు అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు, దాదాపు 10 గంటలు పడుతున్నాయి. గతేడాతో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు వస్తున్నారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఛైర్మన్ పీఎస్ ప్రశాంత్ చెప్పారు.
ఈ సీజన్లో మొదటి తొమ్మిది రోజుల్లో 6 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని టీడీబీ ఛైర్మన్ తెలిపారు. నవంబర్ 15న సాయంత్రం ఆలయం తెరుచుకోగా, తొమ్మిది రోజుల్లో 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. గత సంవత్సరం మొదటి తొమ్మిది రోజుల్లో కేవలం మూడు లక్షల మూడు వేల యాభై ఒక్క మంది మాత్రమే వచ్చారని ఆయన చెప్పారు. అధికారులు, పోలీసుల ముందస్తు చర్యలతో, పవిత్ర పదునెట్టాంబడిపై నిమిషానికి 80 మంది భక్తులు ఎక్కగలుగుతున్నారని ఆయన తెలిపారు.
భక్తుల రద్దీ పెరగడంతోపాటు ఆలయానికి ఆదాయం కూడా భారీగా పెరిగిందని దేవస్థానం బోర్డు ఛైర్మన్ తెలిపారు. గతేడాదితో పోల్చితే హుండీ, కానుకలు, ప్రసాదాల ద్వారా మంచి ఆదాయం వచ్చిందని చెప్పారు. గత సీజన్లో ఈ సమయానికి రూ.28.38 కోట్లు ఆదాయం వచ్చితే, ఇప్పుడు అది రూ.41.64 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది గతేడాది కంటే రూ.13.37 కోట్లు అధికమైంది. ఆయన చెప్పినట్లు, ప్రసాదాలు అమ్మడం ద్వారా ఇరవై కోట్ల రూపాయలు, అరవణ పాయసం అమ్మడం ద్వారా పదిహేడు కోట్ల యెబ్బై ఒక్క లక్షల రూపాయలు, అప్పం అమ్మడం ద్వారా రెండు కోట్ల యెబ్బై ఒక్క లక్షల రూపాయలు వచ్చాయి.
భక్తుల రద్దీని చూసి మెరుగైన వసతులు అందిస్తున్నామని పీఎస్ ప్రశాంత్ అన్నారు. స్పాట్ బుకింగ్ టిక్కెట్ల కోసం వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలో మూడు ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పంబా వద్ద ఉన్న రియల్-టైమ్ ఆన్లైన్ బుకింగ్ వద్ద ఆధార్ కార్డు చూపించి స్పాట్ బుకింగ్ టోకెన్ తీసుకోవచ్చని సూచించారు. ఆదివారం, సన్నిధానంలోని దేవస్థానం బోర్డు గెస్ట్ హౌస్లో యాత్ర ఏర్పాట్లు, సాగుతోన్న పరిస్థితి గురించి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
భక్తులు ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావద్దని అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన తంత్రి కందరారు రాజీవరు సూచించారు. ఆయన సూచనలను తప్పక పాటించాలని కోరారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు