Connect with us

Latest Updates

శబరిమల: మండల పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల.. ప్రతి రోజు ఎన్ని వేల మంది భక్తులకు దర్శనం అందుతుంది?

శబరిమల: మండల పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల.. ప్రతి రోజు ఎన్ని వేల మంది భక్తులకు దర్శనం అందుతుంది?

పశ్చిమ కనుమల్లోని పత్తనంతిట్టా జిల్లా లో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, రెండు నెలల పాటు జరిగే మండల మకర విళక్కు యాత్ర ప్రారంభం అవుతోంది. ఈ సమయంలో స్వామి దర్శనం కోసం అయ్యప్ప దీక్షాదారులు వేలాదిగా తరలివస్తారు. గత సంవత్సరం భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండగా, ఆ సంఖ్యకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు వచ్చాయి. చాలా మంది దర్శనాలు చేసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో ప్రస్తుతం పక్కా ఏర్పాట్లు చేశారు.

రెండు నెలల పాటు జరిగే మండల మకరవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం (నవంబరు 15న) సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. రోజుకు ఎంత మంది భక్తులను దర్శనాలకు అనుమతించేల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది కలిసి మొత్తం 80 వేల మందిని దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.

శబరిమల సహా పలు ఆలయాలను నిర్వహిస్తోన్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మధ్యాహ్నం 1 గంట నుంచి యాత్రికులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది కలిసి మొత్తం 80 వేల మందిని దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. కానీ, దర్శనాలు మాత్రం శనివారం ఉదయం మొదలవుతాయని, అప్పటి నుంచే మండల పూజల సీజన్ అధికారికంగా మొదలవుతుందని పేర్కొంది. మరొక వైపు, శుక్రవారం 30 వేల మంది భక్తులు వర్చువల్ క్యూ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొన్నారు. వారిని గురువారం 1 గంట తర్వాత పంబ నుంచి అనుమతిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనాల సమయం కూడా పెంచారు. రోజుకు 18 గంటల పాటు దర్శనాలు ఉంటాయని టీడీబీ ఇప్పటికే ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో 914 మీటర్ల ఎత్తులో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, పంబ నుండి 4 కిలోమీటర్ల కాలినడకలో చేరుకోవాల్సి ఉంటుంది.

ఇక, 10 ఏళ్ల నిండినవారు, 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయానికి ప్రవేశం లేదు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం అంటే 41 రోజుల పాటు దీక్ష చేసి, ఇరుమడితో వస్తారు. పావన పదునెట్టాంబడి (18 మెట్లు) మీదుగా స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి ఉన్నవారికే పదునెట్టాంబడి ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. సాధారణ భక్తులకు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. వీరిని పక్కనే ఉన్న గేటు ద్వారా అనుమతిస్తారు.

ఇక, మండల-మకర విళక్కు పూజల ఏర్పాట్లు మరియు బందోబస్తు మీద కేరళ డీజీపీ షేక్ దర్వైష్ సాహెబ్ గురువారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 14 వేల మంది పోలీసులు మరియు వాలంటీర్లను భద్రతా విధులు మరియు యాత్రికుల సేవల కోసం నియమించారు. భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాలను 10 వేలకు పెంచారు. అలాగే, రెస్టారెంట్లు, హోటళ్ల ధరల వివరాలు దక్షిణాది అన్ని భాషల్లో ప్రదర్శించాలనే ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

Loading

Trending