Latest Updates
నేను గ్యారెంటీ ఇస్తున్నా, అదానీని అరెస్ట్ చేయరు,.. రాహుల్ గాంధీ కీలకవ్యాఖ్యలు

నేను గ్యారెంటీ ఇస్తున్నా, అదానీని అరెస్ట్ చేయరు,.. రాహుల్ గాంధీ కీలకవ్యాఖ్యలు
గౌతమ్ అదానీని అరెస్ట్ చేయవద్దు, ఆయనపై విచారణ కూడా జరగదు అని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లంచం ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తున్నది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడి సంచలన ఆరోపణలు చేశారు. భారత్, అమెరికా చట్టాలను గౌతమ్ అదానీ ఉల్లంఘించారని, ఆయనకు సెబీ చీఫ్, ప్రధాని మోదీ సహాయం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.
ఇప్పటికైనా గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే, అదానీని రక్షిస్తున్న సెబీ చీఫ్ మాధభి పురి బచ్ను తొలగించి, ఆమెపై కూడా విచారణ జరపాలని చెప్పారు. అయితే, అదానీని అరెస్ట్ చేయరు అని రాహుల్ గాంధీ చెప్పారు, అందుకు తాను గ్యారెంటీ ఇస్తున్నట్లు చెప్పారు. గౌతమ్ అదానీని ప్రధాని నరేంద్ర మోదీ రక్షిస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
అదానీపై తీవ్ర ఆరోపణలు పెరిగిన సమయంలో, గురువారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, అదానీ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గౌతమ్ అదానీ అమెరికా మరియు భారత చట్టాలను ఉల్లంఘించారని రాహుల్ గాంధీ చెప్పారు. మోదీ, అదానీల బంధం భారత్లో ఉన్నంత వరకు సురక్షితమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీ ద్వారా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ అవినీతి ద్వారా భారతదేశ ఆస్తులన్నీ గౌతమ్ అదానీ కొల్లగొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే గౌతమ్ అదానీని అరెస్ట్ చేసి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇన్ని ఆరోపణలు వస్తున్న వ్యక్తి దేశంలో స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారో తనకు ఆశ్చర్యం వేస్తోందని రాహుల్ గాంధీ వెల్లడించారు.
అదే సమయంలో గౌతమ్ అదానీని రక్షిస్తున్న సెబీ చీఫ్ మాధబీ పురి బచ్ను ఆ పదవి నుంచి తొలగించాలని.. అనంతరం ఆమె పైనా విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. అయితే గౌతమ్ అదానీ అరెస్ట్ కాడని.. ఆయనపై విచారణ జరగదని తాను గ్యారంటీ ఇస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే అదానీని మోదీ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందే సోలార్ పవర్ ఒప్పందాలు సాధించడానికి అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చిందని అమెరికా ప్రాసిక్యూటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తరువాత, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను తప్పు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించడానికి అదానీ గ్రూప్ ప్రయత్నించిందని చెప్పారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా అక్రమ మార్గాల్లో 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించిందని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఇక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అదానీ గ్రూప్పై మరో సివిల్ కేసు నమోదు చేసింది. అమెరికా సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించిందని తెలిపింది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు