Connect with us

Latest Updates

ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు మోదీ సర్కార్ కొత్త పథకం.. ఎలా అప్లై చేసుకోవాలంటే ?

ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు మోదీ సర్కార్ కొత్త పథకం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని సీనియర్ సిటిజెన్స్‌కు అండీచడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.  70 ఏళ్లు దాటిన వృద్ధులు అందరికీ ఉచితంగా వార్షిక ఆరోగ్య బీమాను రూ. 5 లక్షల అందించనున్నారు. ధనికులు, పేదలు, కుటుంబ ఆదాయంతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంతకీ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడం ఎలానో చూడండి

AB PMJAY: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళవారు ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ ఏబీ పీఎంజేఏవై పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద పేద, ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను కల్పించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గర్భిణులు, చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు రూపొందించిన యూ-విన్‌ పోర్టల్‌ (U-WIN)ను ప్రారంభించారు.

ఈ ఏబీ పీఎంజేఏవై ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్లమంది 70 ఏళ్లు దాటిన వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఆధార్ కార్డుపై ఉన్న వయసు ఆధారంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లభించనుంది.

AB PMJAY కింద దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలో ఉన్న వృద్ధులకు.. ఉన్నదాని కంటే అదనంగా మరో రూ.5 లక్షల కవరేజీ లభిస్తుంది. ఇక ఒకే కుటుంబంలో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉంటే వారికి చెరి సగం ప్రయోజనం అంటే చెరో రూ.2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

Advertisement

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన-ఏబీపీఎంజేఏవై (AB PMJAY)దరఖాస్తు:

ఈ ఏబీ పీఎంజేఏవై పథకంలో చేరాలంటే మొట్టమొదట పీఎం జేఏవై పోర్టల్‌ లేదా ఆయుష్మాన్‌ యాప్‌లో అప్లై చేసుకోవాలి. PMJAY పోర్టల్‌లో ‘యామ్‌ ఐ ఎలిజిబుల్‌(Am I Eligible)’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. దానిపై క్లిక్ చేయగానే

beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాప్చా కోడ్, మొబైల్‌ నంబర్‌ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేయాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. మనం చేసిన అప్లికేషన్ అధికారులకు వెళ్తుంది. ఆయుష్మాన్‌ కార్డు సిద్ధమైన తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లై చేసుకునేందుకు కావాల్సిన పత్రాల్లో ఆధార్‌ కార్డు ఒక్కటే సరిపోతుందని ఇటీవల కేంద్రపాలిత, రాష్ట్రాలు, ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం వెల్లడించింది.

 

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending