Connect with us

Latest Updates

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి .. సభ ముందుకు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు, ఎన్నికలు,

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ వింటర్ సెషన్స్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో చర్చకు దారి తీస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, జమిలి ఎన్నికల బిల్లులను ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు వేళైంది. ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు శనివారం పేర్కొన్నాయి. అయితే ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలిపారు. జమిలి ఎన్నికలు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వస్తాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించడం గమనార్హం.
నవంబర్ 26వ తేదీన పార్లమెంటు ఉభయ సభల సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్‌ బోర్డ్ సవరణ బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గురుగావ్‌ సభలో అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇండియూ కూటమి సహా దేశంలోని చాలా పార్టీలు జమిలి ఎన్నికలు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కావని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు బిల్లులు గనక పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ కూటమి.. విపక్ష ఇండియా కూటమి సభ్యుల మధ్య వాడీ వేడి చర్చ సాగతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి శీతాకాల సమావేశం. ఈ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు, జమిలి ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా గురించి తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరిగాయి. ఆ సమావేశాల్లో మొత్తం 15 సమావేశాలు జరిగి, 115 గంటలు కొనసాగాయి. ఆ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

 

Loading

Advertisement

Trending