Connect with us

Latest Updates

డెల్‌హీ కాలుష్యం: రైతులు పంట వ్యర్థాలను ఎలా తగలబెడుతున్నారో చూశారా?.. నాసా శాటిలైట్ ఫోటోలు వైరల్.

డెల్‌హీ కాలుష్యం: రైతులు పంట వ్యర్థాలను ఎలా తగలబెడుతున్నారో చూశారా?.. నాసా శాటిలైట్ ఫోటోలు వైరల్.

శీతాకాలం మొదలైనప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వాసులకు నిద్రపోడానికి కష్టం ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ లో గాలి నాణ్యత చాలా దారుణంగా మారింది. ఉత్తరాదిలో వర్షాకాలం ముగింపు తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో వాయు కాలుష్యం మరింత తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించడం ఒక పెద్ద సవాలుగా మారింది. శుక్రవారం నుండి, ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆంక్షలను జీఆర్ఏపీ 3 అమల్లోకి తీసుకొచ్చింది.

కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీ నగరం విలవిలలాడుతోంది. రోజు రోజుకూ వాయు నాణ్యత సూచీ దారుణంగా పడిపోతోంది. దట్టమైన పొగమంచు అలముకుంది. మూడో రోజు వరుసగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకరమైన స్థాయిని దాటింది. శుక్రవావారం ఉదయం ఏకంగా 498 పాయింట్లగా నమోదైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌ నగరం 770 పాయింట్లతో మొదటి స్థానం పొందింది. ఢిల్లీలోని జహంగీర్‌పూర్ (458), బవానా (455), వాజీపూర్ (455), రోహిణి (452), పంజాబీ బాగ్ (443) ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన కాలుష్య స్థలాలుగా మారాయి. పొగమంచు కమ్మేయడంతో పక్కన ఉన్నవారు సైతం కనిపించని పరిస్థితి. ఇది ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమానాలు మరియు రైళ్ల సేవలకు ప్రభావం చూపింది. పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ) 3’ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని నిర్మాణ పనులు, కూల్చివేతలు.. పెట్రోల్‌తో నడిచే బీఎస్-3, డీజిల్‌తో నడిచే బీఎస్-4 వాహనాలు, డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలుకానుంది. రహదారులపై దుమ్మును పారద్రోలడానికి నీళ్లు చల్లే ప్రక్రియ కొనసాగిస్తారు. ప్రజారవాణా సేవలను పెంచనున్నారు.

అటు, కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలు (ఐదో తరగతి వరకు) ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆతిశీ ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకూ ఇవి కొనసాగుతాయన్నారు. కాలుష్య తీవ్రత దృష్ట్యా అన్ని ప్రైమరీ స్కూల్‌ తరగతులు ఆన్‌లైన్‌కు మారుతున్నట్లు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.

పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్ధాల దగ్ధం వంటి సంఘటనలు అధికం కావడమే కాలుష్యానికి ఓ కారణమని నిపుణులు అంటున్నారు. అందుకు సంబంధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటివల విడుదల చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్, హర్యానాలలో లైవ్ ఫైర్ మ్యాప్ భారీ అగ్నిప్రమాదాల నాసా ఫోటోలు ఈ కాలుష్యం తీవ్రతను స్పష్టంగా చూపిస్తుండటం విశేషం.

Advertisement

ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు, నవంబర్ మొదటి వారంలో సింధు-గంగా మైదానాల్లో రైతులు పంట కోత తర్వాత వ్యర్థాలను తగలబెట్టారు. ఆ సమయంలో వచ్చిన పొగ మేఘాలను నాసా ఉపగ్రహాలు గుర్తించాయి. పంజాబ్, ఉత్తర భారతదేశం, పాకిస్థాన్ వంటి జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. పంజాబ్‌లో రైతులు తరచుగా గోధుమ, వరి పంట కోసం పొలాలను సిద్ధం చేసేందుకు వాటి అవశేషాలను తగులబెడతారు. ఇది చౌకైన పద్ధతిగా ఉండగా, దీనితో ఉద్భవించే కాలుష్యం ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.

Loading

Trending