Connect with us

Latest Updates

మణిపూర్ హింసకు చిదంబరమే కారణమని సీఎం బీరెన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 

మణిపూర్ హింసకు చిదంబరమే కారణమని సీఎం బీరెన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 

మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర హింసాత్మక పరిస్థితులకు కారణం కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన తప్పుల కారణంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని సీఎం బీరెన్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మణిపూర్ పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుతం మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మీద కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేస్తూన్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆ రాష్ట్రంలో జాతుల మధ్య హింసకు కారణం బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అలాగే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే, అధికార బీజేపీ కూడా కాంగ్రెస్‌పై ప్రతివిమర్శలు చేయడాన్ని ప్రారంభించింది. మణిపూర్‌లో మంటలు చెలరేగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి. చిదంబరం అని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దేన్నీ బాధ్యుడని పి. చిదంబరం చేసిన ఆరోపణలను బీరెన్ సింగ్ ఖండించారు.
 గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులను ఎత్తి చూపిన బీరెన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి తనను బాధ్యుడిగా చేయడం సరి కాదని ఆయన తెలిపారు. కనీసం, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులే మణిపూర్ హింసకు కారణమని బీరెన్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు మణిపూర్ సీఎంగా ఓక్రమ్ ఇబోబి సింగ్ పనిచేశారని చెప్పారు. 

గతంలో మయన్మార్‌కు చెందిన తంగ్లియన్‌పావ్ గైట్‌ని ఓక్రమ్ ఇబోబి సింగ్.. మణిపూర్‌లోకి తీసుకువచ్చారని బీరెన్ సింగ్ ఆరోపించారు. మయన్మార్‌లో నిషేధిత జోమీ రీ-యూనిఫికేషన్ ఆర్మీ ఛైర్మన్‌ తంగ్లియన్‌పావ్ గైట్‌ అని తెలిపారు. మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల సమస్య మణిపూర్‌లో ఈ పరిస్థితులకు దారితీసిందని పేర్కొన్నారు. మణిపూర్‌లో అన్ని సమస్యలను సృష్టించింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈశాన్య ప్రాంతాలను, అక్కడ ఉన్న ప్రజలను ఎన్నడూ పట్టించుకోలేదని పేర్కొన్న బీరెన్ సింగ్.. ఈ పరిస్థితికి పి.చిదంబరం కారణం అని ఆరోపించారు. 

మణిపూర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించడంలో సీఎం బీరెన్ సింగ్ తీవ్రంగా విఫలమయ్యారని పౌరహక్కుల నేత, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల చెప్పారు. మణిపూర్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మణిపూర్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఎంతో మంది చిన్నారులు మరియు మహిళలు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.  

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending