Connect with us

Latest Updates

ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారు కిరీటం చోరీ.

దుర్గామాత ఆలయంలో ఘటన ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారు కిరీటం చోరీ..

ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ కాళీ ఆలయంలో బంగారు కిరీటాన్ని తాజాగా ఓ దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు. దొంగతనం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఆ గుడిలో ఉన్న. ఇక ఆ బంగారు కిరీటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిఫ్ట్‌గా ఇవ్వడం గమనార్హం. దీనిపై ఆలయ వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలో ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. ఇన్ని రోజులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఇక పశ్చిమ బెంగాల్‌తోపాటు బంగ్లాదేశ్‌లలోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో 4 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నే బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నగరంలో ఉన్న శ్యామ్‌నగర్‌ ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం దొంగతనానికి గురైంది. ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి.

ఇక బంగ్లాదేశ్‌లో చోరీకి గురైన ఆ కాళీ ఆలయ కిరీటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.

ఇక ఆలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చోటు చేసుకుంది. ఆ ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ.. రోజు లాగే గురువారం పూజను పూర్తి చేసిన తర్వాత ఆలయానికి సంబంధించిన తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. అయితే ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్.. తిరిగి వచ్చి చూసే వరకు కిరీటం కనిపించలేదు. దీంతో ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఆలయ సిబ్బంది చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ఉన్న ఆధారాలతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. శ్యామ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫకర్ తైజుర్ రెహ్మాన్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. గతంలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన సమయంలో ఆ బంగారు కిరీటీన్ని బహుమతిగా ఇచ్చారని.. ఇప్పుడు అది దొంగతనానికి గురైందని పేర్కొన్నారు.

 

Loading

Trending