Latest Updates
మెట్రో ప్రయాణికులకు మంచి వార్త.. రూ.10కి బైక్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి.

మెట్రో ప్రయాణికులకు మంచి వార్త.. రూ.10కి బైక్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి.
Metro Rail: నగర ప్రయాణికులకు మెట్రో రైల్ కార్పొరేషన్ శుభవార్త అందించింది. నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు.. మెట్రో రైలు దిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలు చేరుకోవచ్చని తెలిపింది. అందుకోసం బైక్ టాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మొబైల్ యాప్ ద్వారా ఈ బైక్ టాక్సీలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించింది. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పింది.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు నగరవాసులకు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. మెట్రోలో ప్రయాణించే వారికి ఇది మంచి వార్త. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మెట్రో రైలు వెళ్లాక, అక్కడి నుంచి గమ్యస్థానాలకు వెళ్లడానికి ఆటో, బస్సులు, సొంత వాహనాలు లేదా ఇతర టాక్సీలను ఉపయోగిస్తుంటాము. అయితే ఇక నుంచి అలాంటి ఇబ్బంది అవసరం లేదు. ఎందుకంటే మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులే ప్రత్యేకంగా బైక్ టాక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని 12 మెట్రో స్టేషన్లలో ఈ బైక్ టాక్సీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా మహిళలే నడిపే బైక్ టాక్సీలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అయితే ఈ బైక్ టాక్సీలు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఢిల్లీ మెట్రో పరిధిలో ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ బైక్ టాక్సీ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇక మరికొన్ని రోజుల్లోనే మరిన్ని మెట్రో స్టేషన్లకు ఈ బైక్ టాక్సీ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో మెట్రో ప్రయాణికులు డీఎంఆర్సీకి చెందిన ఢిల్లీ సార్థీ 2.0 మొబైల్ యాప్ ద్వారా ఈ బైక్ టాక్సీలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ బైక్ టాక్సీ సేవలు “ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” అనే సంస్థతో భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే మూడు నెలల్లో మిగిలిన స్టేషన్లలో కూడా ఈ బైక్ టాక్సీలు అందుబాటులోకి రానున్నట్లు డీఎంఆర్సీ పేర్కొంది.
ఢిల్లీ మెట్రో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బైక్ టాక్సీ సేవను ప్రారంభించింది. ఇందులో రెండు రకాల బైక్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం “షీరైడ్స్” అని పిలువబడుతుంది, ఇది ప్రత్యేకంగా మహిళల కోసం తీసుకువచ్చారు. ఇందులో మహిళలే బైక్ టాక్సీని నడుపుతారు. షీరైడ్స్లో ప్రయాణానికి కనీస ధర రూ.10 మాత్రమే నిర్ణయించారు. ఇక రెండోది ‘రైడర్ టాక్సీ’. ఈ బైక్ టాక్సీ పురుషులు, మహిళలకు అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బైక్ టాక్సీలన్నీ ఎలక్ట్రిక్ బైక్లు అని.. వీటి వల్ల కాలుష్యం ఏర్పడదని స్పష్టం చేశారు.
ఢిల్లీ మెట్రో అధికారులు మొదటిగా 200 బైక్ టాక్సీలను ప్రారంభించారు. ఇందులో 150 రైడర్ బైక్ టాక్సీలు, మరో 50 షీరైడ్స్ బైక్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బైక్ టాక్సీలు ఢిల్లీలోని 12 మెట్రో స్టేషన్ల పరిధిలో సేవలు అందించనున్నాయి. ప్రతీ మెట్రో స్టేషన్కు 3 నుంచి 5 కిలోమీటర్ల రేంజ్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులోకి ఉన్నట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు