Connect with us

Latest Updates

28 లక్షల దీపాలతో అయోధ్య బాలరాముడి సన్నిధిలో తొలి దీపావళి దీపోత్సవం

అయోధ్యలో దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామమందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం మొదటిసారి జరగుతున్న దీపోత్సవం కావడంతో ఈ ఉత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గత ఏడాది 25 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు సాధించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, ఈసారి 3 లక్షలు పెంచి మొత్తం 28 లక్షల దీపాలు వెలిగించి ఆ రికార్డును మళ్లీ సృష్టించాలని నిర్ణయించింది

దీపావళి పండగ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో దీపోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో దీపోత్సవానికి అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది దీపావళి పండుగ రోజు చాలా దీపాలను వెలిగించి, ప్రపంచంలో రికార్డు సృష్టించేందుకు ఉత్తర్‌ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది ప్రతీ సంవత్సరం దీపావళి పండగకు ఒక రోజు ముందు.. అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపోత్సవ్ కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతేడాది 25 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించగా.. ఈ ఏడాది 28 లక్షలతో ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగే దీపోత్సవ్‌ వేడుకలకు అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం సరయూ నదీ తీరంలో ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సరయూ నది ఒడ్డున ఉన్న మొత్తం 51 ఘాట్‌లలో ఒకేసారి 28 లక్షల దీపాలు వెలిగించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దీపోత్సవం కార్యక్రమంలో 30,000 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఇక అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22వ తేదీన నిర్వహించిన రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరుగుతున్న దీపావళి పండుగ కావడంతో ఈ దీపోత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని యోగి ఆదిత్యనాత్ ప్రభుత్వం భావిస్తోంది.

ఇక దీపావళి, దీపోత్సవం సందర్భంగా అయోధ్య రామమందిరం మొత్తాన్ని పూలు, విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సరయూ నదికి పూజ చేయబోతున్నారు. ఆ తర్వాత నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరిస్తూ.. దీపాలను లెక్కించనున్నారు. ఈ దీపోత్సవానికి అన్ని శాఖల మంత్రులు, ప్రభుత్వ అధికారులు రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో లేజర్‌ షో ప్రజలకు అందించనునరు.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending