Latest Updates
UP: మెడికల్ కాలేజీలో దుర్ఘటన.. 10 మంది పిల్లలు మంటల్లో కాలిపోయారు.

UP: మెడికల్ కాలేజీలో దుర్ఘటన.. 10 మంది పిల్లలు మంటల్లో కాలిపోయారు.
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు మరణించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, ఆ సమయంలో ఆ పిల్లలు ఇంక్యుబేటర్లలో ఉన్నారని తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
ఉత్తర ప్రదేశ్లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో మంటలు వెలిగాయి. నియోనాటల్ ఐసీయూలో మంటలు వెలిగాయి. ఈ ప్రమాదంలో పది శిశువులు మరణించారు. ఒక్కసారిగా మంటలు పాకడంతో రోగులు మరియు ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకి పరుగులు తీశారు. ఈ సమయంలో ఆసుపత్రిలో కొంత తొక్కిసలాట జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
మెడికల్ కాలేజీలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న శిశువులకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పబడుతుంది. మెడికల్ కాలేజీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని బయటకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న గర్భిణుల్ని వారి బంధువులు క్షేమంగా బయటకు తీసుకుని వెళ్లారు. ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసే సరికి, జిల్లా అధికారులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని సహాయ పనులను పర్యవేక్షిస్తున్నారు. మంటలు, పొగ పీల్చడంతో కొంతమంది చిన్నారుల అస్వస్థతకు గురయ్యారు.. వారికి వైద్యం అందిస్తున్నారు.
మరొక వైపు, ఝాన్సీలో జరిగిన ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దుఃఖం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, ఎలా జరిగిందో పరిశీలించాలన్నది ఆయన సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ మరియు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు