Latest Updates
చివరి రోజున చంద్రచూడ్ కీలక తీర్పు అలీగఢ్ ముస్లిం వర్సిటీకి మైనార్టీ హోదాసీజేఐగా

చివరి రోజున చంద్రచూడ్ కీలక తీర్పు అలీగఢ్ ముస్లిం వర్సిటీకి మైనార్టీ హోదాసీజేఐగా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి వీడనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్కు నేడు సీజేఐగా చివరి పనిదినం. ఈ రోజు ఆయన కీలక తీర్పు ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రసిద్ధ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉందా లేదా అన్న అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (AMU) మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. యూనివర్సిటీ మైనార్టీ హోదా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు రాజ్యాంగం ధర్మాసనం 4-3 మెజారిటీతో తీర్పు చెప్పింది. వర్సిటీకి మైనారిటీ హోదాను చట్టం ద్వారా కల్పించారని స్పష్టం చేసింది. ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967 నాటి సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 కింద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని పేర్కొంది.
ఈ కేసులో ఎనిమిది రోజుల పాటు వరుసగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 1న తీర్పు రిజర్వు చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్కు ఈ రోజు చివరి పనిదినం కావడంతో, కీలకమైన ఈ తీర్పు ఇవ్వడం విశేషం. మతపరమైన, భాషాపరమైన మైనారిటీలకు విద్యాసంస్థల ఏర్పాటుకు అధికారం కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) మైనారిటీ హోదా పొందుతుందా లేదా అనే సందేహాలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ముగింపు లభించింది.
ఏఎంయూ సవరణ చట్టం1981 మైనారిటీ హోదాను కల్పించిందని పేర్కొంది. అయితే, ఇది అసంపూర్తిగా ఉందని, దానిని పునరుద్ధరించలేదని పేర్కొంది. ఏఎంయూ చట్టం 1920లో అలీగఢ్లో ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. 1951 సవరణ ద్వారా ముస్లిం విద్యార్థులకు మతపరమైన తప్పనిసరి సూచనలు తొలగించాయి. ఇక 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని ముస్లిం కమ్యూనిటీ మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీగా ఏర్పాటై.. 1920లో అలీగఢ్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. “మాకు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 1981 సవరణ 1951కి ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించలేదు. మరో మాటలో చెప్పాలంటే 1981 సవరణ సగం పని మాత్రమే చేసింది,” అని జస్టిస్ చంద్రచూడ్ తన వాదనలను ముగించారు.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 9న ముగియనుంది. అందువల్ల ఆయనకు సీజేగా నవంబర్ 8 (శుక్రవారం) చివరి పనిదినం.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు