Latest Updates
అయ్యప్ప భక్తులకు మంచి వార్త.. శబరిమలలో స్వామి దర్శనం మరింత వేగంగా ఉంటుంది.

అయ్యప్ప భక్తులకు మంచి వార్త.. శబరిమలలో స్వామి దర్శనం మరింత వేగంగా ఉంటుంది.
శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల కిందటే ఈ పూజల కోసం ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం జరిగిన అనుభవాలను బట్టి, కేరళ ప్రభుత్వం మరియు దేవస్థానం బోర్డు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. రద్దీని నియంత్రించి, భక్తులకు సౌకర్యంగా స్వామి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. గత నాలుగు రోజుల నుంచి యాత్ర సజావుగా సాగుతోందని అధికారులు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు.
రెండు నెలల మండల మకరువిళక్కు పూజల కోసం శుక్రవారం తెరుచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు పెద్దఎత్తున క్యూలైన్లలో పడిగాపులు కాయకుండా ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు పోలీసులు చేసిన ఏర్పాట్లకు మార్గం సుగమమైంది. పోలీస్ చీఫ్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ఏర్పాట్లు విషయంలో కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి. పదునెట్టాంబడి వద్ద అనుభవం లేని పోలీసులు విధులు నిర్వర్తించడంతో గత సారి రద్దీ పెరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ సీజన్లో అలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.
ఏడీజీపీ శ్రీజిత్ ఆదేశాల ప్రకారం, పదునెట్టాంబడి వద్ద పనిచేయడానికి ఆసక్తి ఉన్న పోలీసులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చారు. వారిని 18 మెట్లకు ఇరువైపులా కూర్చోవడానికి అనుమతించారు, ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తున్నారు. నిమిషానికి సగటున 80 నుంచి 90 మంది భక్తులు 18 మెట్లు ఎక్కుతున్నారు. అంతకుముందు 60 మందిని మాత్రమే అనుమతించేవారు. సోమవారం సాయంత్రం వరకు నాలుగు రోజుల్లో 2.26 లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. రోజుకు దర్శనాల సమయం 18 గంటల ఉండేలా చర్యలు తీసుకోవడంతో ఇప్పటి వరకూ ఎటువంటి ఇబ్బంది లేదు.
మరొక వైపు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక క్యూలను ఏర్పాటుచేసింది. వలియ నడపంతల్ నుంచి మొదలయ్యే ఈ క్యూలైన్ నుంచి నేరుగా పదునెట్టాంబడికి చేరుకోవచ్చని టీడీబీ ఛైర్మన్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. చిన్నారులు, వృద్ధులకు తోడుగా ఒక్కర్ని అనుమతిస్తామని ఆయన చెప్పారు. అలాగే, పద్దెమిది మెట్ల వద్ద పోలీసుల డ్యూటీ సమయం కూడా 20 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించామని వివరించారు. నిమిషానికి కనీసం 80 మంది భక్తులు మెట్లపై నుంచి వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పంపా నుంచి శబరిగిరి వచ్చే మార్గంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని చెప్పారు.
మరోవైపు, శబరి యాత్రికుల కోసం నిలక్కల్ నుంచి పంపా మధ్య కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) మొదటి దశలో 383 బస్సులు నడుపుతోంది. మరో 192 బస్సులను సిద్ధంగా ఉంచింది. రెండో దశలో ఈ సంఖ్య 550కి పెంచనుంది. నిమిషానికి ఒక సర్వీసు అందుబాటులో ఉండగా, భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ సంఖ్యను పెంచుతామని అధికారులు చెప్పారు. ఆలయంలో దర్శనం ప్రారంభమైన మొదటి రోజు శనివారం 1000 సర్వీసులు నడిపినట్టు వారు తెలిపారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు