Connect with us

Andhra Pradesh

శ్రీకాళహస్తి ఆలయంలో అఘోరి.. అన్నంత పని చేసింది, ఇక పోలీసులు ఎంట్రీ

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి మాత శ్రీకాళహస్తిలో ఆత్మార్పణకు యత్నించడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శైవాలయాల సందర్శనలో భాగంగా గురువారం ఆమె తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి వచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా దుస్తులు ధరించి రావాలని ఆలయ సిబ్బంది సూచించారు. తాను అఘోరినని.. ఇలాగే శివయ్యను దర్శించుకుంటానని చెప్పడంతో వారు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

దింతో ఆలయ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఘోరి మాత తన కారులో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకుని శరీరంపై పోసుకుని ఆత్మర్పారణకు ప్రయత్నించారు. దీంతో ఏం జరుగుతుందోనని భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి రక్షించారు. అనంతరం మహిళా పోలీసులు, స్థానిక మహిళలు ఆమెకు నచ్చజెప్పి వస్త్రాలు కట్టారు.

ఈ ఘటనపై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ.. అఘోరి మాత సాధారణంగా భక్తుల్లా స్వామివారిని దర్శనం చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ ఆమె వస్త్రధారణ పాటించకపోవడంతోనే అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ వివాదం పై అఘోరి మాత స్పందిస్తూ.. తాను వైజాగ్ పర్యటనలో వస్త్రధారణ పాటించానని.. అసలు విషయాన్నీ చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఆత్మార్పణకు యత్నించిన అఘోరి మాతను స్థానిక పోలీసులు నివారించడంతో పెను ప్రమాదమే తప్పింది. అఘోరీ మాత ఎక్కడికి వెళ్లినా ఏదొక వివాదం తలెత్తుతుండంతో ఆమె పర్యటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటన సమయంలో ఈ మహిళా అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యారు. ప్రతి రోజూ ఏదో ఒక ఆలయాన్ని దర్శించుకుంటున్న ఆమె.. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని గతంలోనే చెప్పుకొచ్చారు. ఇక ఆమెను తెలంగాణ నుంచి మహారాష్ట్ర కు తరలించారు.. ఆ తర్వాత అఘోరీ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఆలయాలను సందర్శించుకుంటున్నారు.

Advertisement

Loading

Trending