Connect with us

Telangana

జానీ మాస్టర్‌కు ఊరట..! ఎట్టకేలకు బెయిల్ దొరికింది..

జానీ మాస్టర్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వస్తున్నాడు. పోక్సో కేసులో భాగంగా నార్సింగి పోలీసులు జానీని అరెస్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇక జానీకి నేషనల్ అవార్డు రద్దు అవ్వడం, ఆ టైంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ కూడా రద్దు అవ్వడం గురించి కూడా అందరికి తెలుసు. జానీ మాస్టర్‌ అసిస్టెంట్ తన పై పెట్టిన కేసుతో పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు జానీని గోవాలో పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. ఇక ఇప్పుడు జానీకి హై కోర్టు బెయిల్ ఇచ్చింది.

జానీ మాస్టర్ తనను వేధించాడని, పలు మార్లు అత్యాచారం చేశాడని, సెట్స్‌లోనూ అల్లరి చేసేవాడని, కేరవ్యాన్‌లో కూడా విడిచి పెట్టలేదని, మైనర్‌గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశాడంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పైగా పెళ్లి చేసుకోవాలని, మత మార్పడి అంటూ ఒత్తిడి కూడా చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక జానీ మాస్టర్ భార్య పేరుని కూడా ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ భార్య కూడా తనను చాలా సార్లు కొట్టిందంటూ అందులో ఉంది. అయితే ఈ విషయాల మీద జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా మీడియాతో మాట్లాడింది. తనే జానీ మాస్టర్ వెంట పడింది.. పెళ్లి చేసుకోమని వేధించింది.. ఆమెకు చాలా ఎఫైర్లు ఉన్నాయి అంటూ ఇలా ఇష్టమొచ్చినట్టుగా చెప్పుకొచ్చింది.

జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఆట సందీప్, యానీ మాస్టర్ వంటి వారు బయటకు వచ్చిన ఈ విషయాన్ని ఖండించారు. బండి సరోజ్ వంటి వారు కూడా అలా అవార్డుని రద్దు చేయడం చాల తప్పు అన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత జానీ మాస్టర్ ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.

Loading

Advertisement

Trending