Connect with us

Sports

IND vs AUS: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సెమీ ఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచులో 10 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్ స్టేజ్‌లో కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచిన భారత్.. సెమీస్ చేరాలంటే రేపటి మ్యాచులో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలవాల్సిందే.

ఈ మ్యాచులో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. సరిగ్గా 20 ఓవర్లకు గాను 142/9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (47 బంతులకు 54 రన్స్ నాటౌట్) చేసిన ఒంటరి పోరాటం వృథాగా మారింది. ఇంకొక బ్యాటర్ ఆమెకు సహకరించకపోవడంతో టోర్నీలో తన చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్‌ను భారత్ కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తమ 20 ఓవర్లలో 8 వికెట్లకు గాను 151 పరుగులు చేసింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి రేణుకా సింగ్ షాక్ ఇచ్చింది. అయితే ఓపెనర్ గ్రేస్ హ్యారీస్ (40), తహ్లియా మెక్ గ్రాత్ (32), ఎలీసా పెర్రీ (32)లు జట్టును ఆదుకున్నారు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ కొట్టిన లిచ్ హెల్డ్ తన జట్టు స్కోరును 150 పరుగులకు చేరుకునేలా చేసింది.

ఇక భారత బౌలర్లలో రేణుక సింగ్ 2 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లు తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇక ఈ మ్యాచ్‌ ఓటమితో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను చిక్కులో పడేలా చేసుకుంది. అయితే భారత్ సెమీస్ చేరేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది. గ్రూప్-Aలో చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో ఈరోజు న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ బృందం సెమీస్‌కు అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇందుకు నెట్ రన్ రేట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఇక ఈ మ్యాచులో పాకిస్థాన్ గెలిస్తే.. భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు లీగ్ స్టేజ్‌ను రెండు విజయాలతో మగిస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న జట్టు తర్వాత రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం.. గ్రూప్-A నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలుస్తుంది. భారత జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Loading

Trending