Connect with us

Latest Updates

ఎన్నికల్లో తెలుగు యువకుడు పోటీ.. గెలిస్తే అరుదైన రికార్డులు..

అమెరికాలో తెలుగు యువకుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. టెక్సాస్‌ రాష్ట్రంలో మేయర్‌ ఎన్నికల్లో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బాపట్లకు చెందిన కార్తీక్‌ నరాలశెట్టి ఢిల్లీలో చదువుకున్నారు. తర్వాత అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లారు. న్యూజెర్సీ రట్టర్స్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. తరువాత చదువు ముగించకుండా ఇండియాకు తిరిగి వచ్చి, సోషల్‌బ్లడ్‌ అనే ఎన్జీవోను ఏర్పాటు చేసి వ్యాపారవేత్తగా ఎదిగారు. అదే సమయంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీని ప్రారంభించారు.

అమెరికాలో వ్యాపారం చేస్తుండగా, అక్కడే అధితి అనే యువతితో పరిచయం అయింది. ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కార్తీక్ తాను నివసిస్తున్న ‘ది హిల్స్‌’ మేయర్‌ ఎన్నికలపై దృష్టి పెట్టారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కార్తీక్, ఆగస్టు నుంచి అక్కడ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన అనుభవంతో ది హిల్స్‌ అభివృద్ధికి దోహదపడతానంటూ ప్రచారం చేస్తున్నారు. ట్రాన్స్‌పరెన్సీ ఈజ్‌ ద గేమ్‌.. కార్తీక్‌ ఈజ్‌ ది నేమ్‌ అంటూ ది హిల్స్‌ మేయర్‌ ఎన్నికల ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. కార్తీక్‌కు కుటుంబం కూడా అండగా నిలిచింది.

కార్తీక్ మేయర్‌ ఎన్నికల బరిలో ఉన్న ‘ది హిల్స్’లో 2,000 మంది ఉన్నారు. అక్కడ ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నట్లు చెబుతున్నారు. కార్తీక్ ప్రచారం న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహాయంతో జరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో (నవంబర్‌ 5) అక్కడ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ కార్తీక్ ఎన్నికల్లో గెలిస్తే, ‘ది హిల్స్’ మేయర్‌ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, మొదటి భారతీయ వ్యక్తిగా అరుదైన గుర్తింపు పొందుతాడు. గతంలో కూడా భారత్‌ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన వారుఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇప్పుడు కార్తీక్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. మొత్తానికి ది హిల్స్ మేయర్ పదవికి.. ఈ నెల 5న జరగబోయే పోలింగ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్న కార్తీక్‌కు ఆల్ ది బెస్ట్.

Loading

Advertisement

Trending