Connect with us

Sports

IND vs SA: 3rd T20 మ్యాచ్‌లో భారత్ విజయం.. తిలక్ వర్మ సెంచరీ..

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ముందుగా భారత్ బ్యాటింగ్ చేస్తూ, తిలక్ వర్మ సెంచరీతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తరువాత దక్షిణాఫ్రికాను 208/7 వద్ద ఆపేసి గెలిచింది. ఈ విజయంలో తిలక్ వర్మ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయింది. కానీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కలిసి జట్టును నిలబెట్టారు. 8 ఓవర్లలో భారత్ 99/1తో బలంగా నిలిచింది. తిలక్ వర్మ 51 బంతుల్లో సెంచరీ చేశాడు. 23వ మ్యాచ్‌లో ఇది అతని తొలి సెంచరీ. భారత్ 20 ఓవర్లలో 219/6 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టింది. కానీ భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి గెలుపు దిశగా పయనించారు. మార్కో జాన్సెన్ చివరివరకు పోరాడినా, అర్షదీప్ సింగ్ చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బంతులు వేసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

ఈ విజయంతో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచి, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందు ఉంది. చివరి మ్యాచ్ శుక్రవారానికి జరుగుతుంది.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending