Connect with us

Latest Updates

Hydra: అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

 Hydra: అసలేంటీ హైడ్రా, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్ట మవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం పీక్స్‌కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇంతకీ అసలు ఏంటీ హైడ్రా.? దీని పని ఏంటి.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన హైడ్రా అసలు లక్ష్యం ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటీ హైడ్రా..

హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే అని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు.

Advertisement

హైడ్రాకు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తుండగా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు నిర్మోహటంగా కూల్చేసే పనిలో పడింది హైడ్రా. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేశారు. ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని వెనకడగు వేసేది లేదని చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఏం చేశారు..

ప్రభుత్వ లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటి వరకు 166 ఆక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంది. మొత్తం 43.54 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటిలో అత్యధికంగా గాజులరామారంలోని చింతల్‌ చెరువు ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్‌లోని భూమ్రుక్‌ డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌కు తాగు నీటిని అందిస్తున్న గండిపేట్‌ చుట్టూ 24, ఖాన్‌పూర్‌లో 14, చిల్కూర్‌ ప్రాంతంలో 10 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు.

రాజకీయాలకు అతీతంగా..

సాధారణంగా ఇలాంటి అంశాలు రాజకీయంగా వివాదానికి దారి తీస్తాయని తెలిసిందే. అయితే హైడ్రా విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఎలాంటి ఒత్తిడులు వచ్చినా తగ్గేది లేదంటోంది. నిన్నటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన విషయం తెలిసిందే. గీతలో కృష్ణుడు చెప్పిన పనినే తాము చేస్తున్నామని అన్నారు. హైడ్రా చేస్తున్న పని తమ పార్టీలో కూడా కొందరికి నచ్చక పోవచ్చని కానీ చర్యలు తీసుకోవడం మాత్రం ఆగదని స్పష్టం చేసి రాజకీయంగా హీట్‌ పెంచారు.

Advertisement

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎమ్‌ఐఎం పార్టీలకు చెందిన వారి నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చి వేసింది. చింతల్‌లో చెరువును స్థానిక బీఆర్‌ఎస్‌ నాయుడు ఆర్‌ సాయి రాజు, బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందరకు సంబంధించి నందగిరి కొండల్లో ఉన్న నిర్మాణాలను, రాజేంద్ర నగర్‌లో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌, ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌లకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. దీంతో రాజకీయాలకు అతీతం హైడ్రా పనిచేస్తుందని చెప్పకనే చెప్పారు.

విపక్షాలు ఏముంటున్నాయి.?

హైడ్రా చర్యలు ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు అని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తాను లీజుకు తీసుకున్న జన్వాడలోని ఫామ్‌ హౌజ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాంగ్రెకు చెందిన మాజీ ఎంపీ కెవిపి, గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్‌ నాయకుల అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం కొందరి ఆస్తులపైనే దాడులు చేయడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

ఇక బీజేపీ విషయానికొస్తే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. అక్రమ నిర్మాణాలకు గతంలో అనుమతి ఇచ్చింది కాంగ్రెస్‌ కాదా అంటూ ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మెదక్‌ ఎంపీ రఘునందన్‌.. నాగార్జున కన్వెక్షన్‌ సెంటర్‌ కూల్చడం సరైందేనని, ఇతర అక్రమ నిర్మాణాలను సైతం కూల్చేయాలన్నారు. ఇక బీజేపీలో మరో సీనియర్‌ లీడర్‌.. ఎంపీ ఈటల రాజేందర్‌ సైతం ఈ విషయమై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు పేదలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయన్నారు. తాను అద్భుత పాలకుడినని, ఆయన నిక్కచ్చిగా ఉండే ఆఫీసర్ అని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన గుర్తింపు కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.

ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం హైడ్రాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలు అన్నింటిని కూల్చేస్తామనడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆ పరిధుల్లో ప్రైవేటు కట్టడాలతోపాటు ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరి వాటిని కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు పరిస్థితి ఏమిటీ? తొలగిస్తారా? అని అడిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఉన్న చోట గతంలో ఓ కుంట ఉండేదని వివరించారు. ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ఉందని, దాన్ని కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. మరి హైడ్రా తన దూకుడును ఇలాగే కొనసాగిస్తుందా.? లేదా అనేది తెలియాలంటే కాలమే నిర్ణయించాలి.

Advertisement

HYDRA: మూడో కంటికి తెలియకుండా ముప్పేట దాడి

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల రక్షణకు ఏర్పాటైన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకెళ్తాంది. మూడో కంటికి తెలియకుండా రంగంలోకి దిగుతోంది. గతంలో బల్దియా, హెచ్ఎండీఏ అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబులకు రంధ్రాలు చేయడంతో సరిపుచ్చేవారు. హైడ్రా మాత్రం మొత్తం భవనాలను నేలమట్టం చేస్తోంది. కూల్చివేతల సమాచారాన్ని ఏమాత్రం బయటకు రానివ్వడం లేదు. పైగా భారీ ఆక్రమణలపై విరుచుకుపడేందుకు శని, ఆదివారాలను వినియోగించుకుంటోంది.

బల్దియా పరిధిలో ఆక్రమణల తొలగింపు, ఇతరాల కోసం గత ప్రభుత్వ హయాంలో 500 మందితో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఈవీడీఎంఏ)ని ఏర్పాటుచేశారు. దీని బాధ్యతలను ఐపీఎస్ అధికారికి అప్పగించారు. అనంతర కాలంలో ఈ సంస్థ అక్రమాలకు ఆలవాలంగా మారిందన్న ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓఆర్ఆర్ లోపలి భాగంలో ఉన్న మొత్తం ఆక్రమణల తొలగింపు, రక్షణకు సీఎం రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. అందులో ఈవీడీఎంఏని విలీనం చేశారు. బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. హైడ్రా కింద 3వేల మంది సిబ్బందిని నియమిస్తామని, ఒక పోలీసుస్టేషన్ ను ఏర్పాటు చేస్తామని

వెల్లడించారు. దీనికి ఏవీ రంగనాథ్ను కమిషనర్గా నియమించారు. మొదట రంగనాథ్ ఆయా చెరువుల ఆక్రమణపై సమగ్ర అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఉపగ్రహ చిత్రాలను తెప్పించారు. ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించి జాబితాను సిద్ధం చేశారు. మొదటి వారం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడం గమనార్హం

మొదట మఫ్టీలో వెళ్లి పరిశీలన

Advertisement

కూల్చివేతలపై సమాచారం ఎవరికీ తెలియకుండా హైడ్రా కమిషనర్ రంగనాధ్ జాగ్రత్త పడుతున్నారు. సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలను పరిశీలించి వచ్చిన అనంతరం రంగనాథ్ చర్చించి కార్యాచరణకు దిగుతున్నారు. ముందురోజు రాత్రి సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేసి…. మర్నాడు ఉదయమే వారికి సమాచారం ఇస్తున్నారు ఉన్న సిబ్బందితోనే వంతుల వారీగా విరామం లేకుండా పని చేయిస్తున్నారు చింతల్ చెరువులో రోజంతా 50 భవనాలను కూల్చేశారు. కాటేదాన్లో ఒక చెరువులోని ఆక్రమణలను కూల్చివేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అడ్డువస్తే… ఆయనను అరెస్టు చేసి మరీ పూర్తిచేశారు. గండిపేట జలాశయం దగ్గర నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 20 భవనాలను నేలమట్టం చేశారు. ఆయా సందర్భాలలో సమాచారం లీకైతే బాధ్యులను సస్పెండ్ చేస్తామని రంగనాథ్ సిబ్బందిని హెచ్చరించారు. దీంతో ఇక్కడి అధికారులు నోరు మెదపడానికి కూడా భయపడుతున్నారు.

 హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లు.. రంగంలోకి ఏసీబీ అధికారులు

హైడ్రా అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) స్పందించింది.

ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా బుల్డోజర్లు పరిగెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు హైడ్రా అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) స్పందించింది. “కొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. హైడ్రా అధికారులమని పాత నోటీసులు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు గుర్తించాం. ఇలాంటి ఘటనలపై పలు చోట్ల బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నం.1064కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం” అని ఏసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్న హైడ్రా..

Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే దిస్తూ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు.

రాజేంద్రనగర్‌ పరిధి శివరాంపల్లిలో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఇవాళ(శనివారం) తెల్లవారుజాము నుంచే హైడ్రా రంగంలోకి దిగింది. కూల్చివేతలు మెుదలుపెట్టింది. అక్రమ నిర్మాణాల తొలగింపును వారు అడ్డుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య భవనాలు కూల్చివేస్తున్నారు.

మంగళవారం రోజున కూడా గాజుల రామారం చింతలచెరువు బఫర్ జోన్‌లో 52అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌తో సహా 44.3ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తొలగించారు. అలాగే ఈనెల 7న జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌ లేఅవుట్‌లోని పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు. పార్కు స్థలంలో పాన్‌, కిరాణ దుకాణాలు, మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. మెుత్తం 17 తాత్కాలిక నిర్మాణాలను కూల్చవేసి 885చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదే తరహాలో వరసగా ఆక్రమణల తొలగింపు ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్తున్నారు. పార్కు స్థలాలు, చెరువులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం స్థలాలు కబ్జాకు గురైనట్లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 18005990099, 040–29560509, 040–29560596, 040–29565758, 040–29560593నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలాగే తనను వ్యక్తిగతం కలిసేందుకు 7207923085నంబర్‌కు మెసేజ్ చేయాలని తెలిపారు.

Advertisement

హైడ్రా కీలక నిర్ణయం: అధికారులపై క్రిమినల్ కేసులు

 అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు అనధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ విషయంలో హైడ్రా కమిషనర్​రంగనాథ్​చాలా సీరియస్​‌గా ఉన్నారు. మొదట్లోనే చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు లేఖలు రాశారు. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై విజిలెన్స్​విచారణ జరిపి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు. హైడ్రా కమిషనర్​అన్నట్లుగానే ఆరుగురు అధికారులపై క్రిమినల్​కేసులు పెట్టాలని సైబరాబాద్​కమిషనర్‌​కు రంగనాథ్​సిఫారసు చేశారు.

జీహెచ్​ఎంసీ చందానగర్​డిప్యూటీ కమిషనర్‌​తో పాటు హెచ్​ఎండీఏ అసిస్టెంట్​ప్లానింగ్​ఆఫీసర్​, నిజాంపేట మున్సిపల్​కమిషనర్​, సర్వేయర్​సహా బాచుపల్లి తహశీల్దార్​‌పై కేసు నమోదు చేయాలని హైడ్రా నిర్ణయించారు. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల హైడ్రా అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలు నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలున్నాయి. అంతేగాక, ఆధారాలతో సహా సమర్పించినా ఫిర్యాదులను పక్కనపెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులను, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వీరితోపాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్​‌పైనా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులను ఎవరిని ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీరుపారుదల, మున్సిపల్ శాఖల్లో అక్రమ అనుమతులపై జాబితాను సిద్ధం చేసిన హైడ్రా శాఖల వారీగా పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

హైడ్రా.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ నిమిత్తం గత కొన్ని రోజులుగా తెలంగాణ సర్కారు హైడ్రా ద్వారా గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఆక్రమణల తొలగింపు పేరుతో మధ్యతరగతి, పేద వర్గాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మరో వైపు ఆక్రమణ తొలగింపునకు ప్రశంసలు అందుతున్నాయి.

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ నిమిత్తం గత కొన్ని రోజులుగా తెలంగాణ సర్కారు హైడ్రా ద్వారా గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఆక్రమణల తొలగింపు పేరుతో మధ్యతరగతి, పేద వర్గాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మరో వైపు ఆక్రమణ తొలగింపునకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారంనాడు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.  హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఓ ప్రకటనలో రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

హైడ్రాపై సీఎస్ సమీక్ష..

కాగా హైడ్రాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారంనాడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా,ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణంలోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటలీజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఎసిబి డైరెక్టర్ తరణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారని, దీనివల్ల ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. దీనిని నివారించటానికి, ఓ.ఆర్.ఆర్.పరిధిలో అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. జీ.హెచ్,ఎంసీ, ల్యాండ్ ఏంక్రోచ్మెంట్ ఆక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ ఆక్ట్, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారి చేసే అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ పూర్తిగా ఒకే విభాగం హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు వివరించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు. ఎఫ్.టీ.ఎల్, నాలా ఎంక్రోచ్మెంట్, , ప్రభుత్వ కాళీ స్థలాలు, పార్కుల పరిరక్షణ లను హైడ్రా పరిధిలోకి తేనున్నామని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుండి హైడ్రా పరిధిలోకి తేనున్నామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయాడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుండి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్టు సి.ఎస్. తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, రంగారెడ్డి జిలా కలెక్టర్ శశాంక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పౌత్రు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి లు పాల్గొన్నారు.

ఫాతిమా కాలేజీ కూల్చితే విద్యార్థులే తేల్చుకుంటారు.. అక్బరుద్దీన్ కామెంట్స్ పై కలకలం

ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై ఆయన స్పందించారు. చెరువు కబ్జా చేసి ఒవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆక్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించి, కత్తులతో దాడులు చేయండన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని అడ్డుకోవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. ఆ స్కూల్ మాత్రం కూల్చకూడదన్నారు. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించామని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారన్నారు. పాతబస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి గుర్తుచేశారు. ఆ కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. చెరువు కబ్జా చేసి ఒవైసీ నిర్మించిన కాలేజీని కూలుస్తారా? అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ సఖ్యంగా ఉంటోందని విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఒవైసీ కాలేజీని కూలగొడతారా? అని మహేశ్వర రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ కామెంట్పై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. దయచేసి ఆ స్కూల్ కూల్చొద్దని కోరారు అక్బరుద్దీన్ ఒవైసీ. పేద విద్యార్థులకు ఆ పాఠశాల వరం లాంటిదన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదన్నారు. వేలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునే స్కూల్ నేలమట్టమైతే, వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కూల్చినా, కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తామన్నారు. 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందజేస్తున్నామన్నారు. విద్యార్ధులకు అందించే నైపుణ్యాలు, విద్యా బోధన కొందరిలో అసూయను రేకెతిస్తోందని ఆయన నొక్కిచెప్పారు.

హైడ్రా చీఫ్ కు ఎమ్మెల్యే దానం వార్నింగ్

అధికారులు వ‌స్తుంటారు… పోతుంటారు… నేను లోక‌ల్ అంటూ సినిమా డైలాగ్ తో త‌న‌పై న‌మోదైన కేసు గురించి స్పందించారు ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్. ఆయ‌న‌కు కొత్త‌గా వ‌చ్చిన‌ ప‌ద‌వి ఇష్టం లేన‌ట్లుంది… అందుకే నాపై కేసు పెట్టారు అంటూ హైడ్రా చీఫ్ ఐపీఎస్ రంగ‌నాథ్ పై దానం గ‌రంగ‌రం అయ్యారు. హైడ్రా చీఫ్ పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానంటూ ఎమ్మెల్యే దానం ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్ లోని ప్ర‌భుత్వ స్థ‌లం కాంపౌండ్ ను కూల్చివేసిన ఘ‌ట‌న‌పై అందిన ఫిర్యాదుతో దానంపై హైడ్రా కేసు న‌మోదు చేసింది. అయితే, ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్… ప్రజాప్రతినిధిగానే అక్క‌డికి వెళ్లా. ఆ హ‌క్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే అక్కడికి వెళ్లా. ప్రజా సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నాపై కేసు నమోదు విషయాన్ని రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లా. కేసులు నాకు కొత్తేమి కాదు. గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నాపై కేసులు పెట్టారు. నందగిరి హిల్స్‌ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్‌ నోటిసులు పంపిస్తా. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ దానం ఫైర్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్ర‌జా ప్ర‌తినిధులు, స్థానిక నాయ‌కులు ఎవ్వ‌రి ప్ర‌మోయం ఉన్నా ఉపేక్షించ‌కుండా… కూల్చివేత‌లు చేప‌ట్టింది.

Advertisement

 

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending