Telangana
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్ వాడుతూ హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్ వాడుతూ హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్వీ్ట్ షాపుల్లో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న నిర్వహకులు ఏమాత్రం శుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పుఢ్ ఐటమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా, దారుణాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, స్వీట్ షాపుల్లో తెలంగామ టాస్క్ఫోర్స్, ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోటల్ నిర్వహకులు ఏమాత్రం శుభ్రత పాటించటం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారు చేస్తున్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్లోని హోటల్స్, స్వీట్ షాపుల్లో అధికారులు గుర్తించిన లోపాలను ట్విట్టర్ ఎక్స్లో వెల్లడించారు.
అమీర్పేట, యూసుఫ్గూడ, చైతన్యపురి ప్రాంతాల్లో ఉన్న కొన్ని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, బేకరీలు, షవర్మ తయారీ కేంద్రాలు, మండీ హౌజ్లలో తనిఖీలు నిర్వహించగా దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. తినడానికి పనికిరాని కూరగాయలు, కుళ్లిపోయిన మాంసం, క్యాన్సర్ కారక సింథటిక్ ఫుడ్ కలర్స్, గ్రీజు లా మారిన వంట నూనె వంటివి గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అమీర్పేటలోని వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్కు లైసెన్సు లేదు. కిచెన్లో బొద్దింకలు, తయారీదారుల వివరాల్లేని ‘రెడీ టూ ఈట్’ ఫుడ్ ఐటమ్స్ విక్రయిస్తున్నారు. వినూత్న ఫుడ్స్కు సైతం లైసెన్సు లేదు. లేబుల్స్ లేకుండా ఆహార పదార్థాల విక్రయిస్తున్నారు. హోటల్ సైతం అపరిశుభ్రంగా ఉంది. ఆగ్రా స్వీట్స్కు లైసెన్సు లేదు. గడువు ముగిసిన చుడవ, బేల్, ఇతర వస్తువుల అమ్ముతున్నారు. ఢిల్లీ మిఠాయివాలాలో.. ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నాయి. తెరచి ఉంచిన చెత్త డబ్బాలు గుర్తించారు.
యూసఫ్గూడ ఏజీ కాలనీలో మహమ్మదీయ షవర్మ కేంద్రంలో నూనె గ్రీజులా మారింది. షవర్మ తయారీలో తుప్పు పట్టిన పాత్రలు వాడుతున్నారు. ఫ్రిడ్జిలో కుళ్లిపోయిన ఆహారం, ఫుడ్ లైసెన్స్ లేకపోవడం వంటివి గుర్తించారు. అల్ మతమ్ మదీనా మండీ హౌస్లో అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం, నేలపై చెత్త కనిపించింది. రాజీవ్ నగర్లోని అల్ ఖాసీం ది మండీ హౌస్లో వంట గదిలో నేలపై వంట సామగ్రి ఉంచారు. ఫ్రిడ్జిలో మురికి నీరు, జిగటగా మారిన పైకప్పు, ఎక్జాస్ట్ ఫ్యాన్, పొయ్యి వంటివి గుర్తించారు.
చైతన్యపురిలోని శిల్పి ఎలైట్ రెస్టారెంట్ అండ్ బార్లో వంటగది ఫ్లోరు, పైకప్పు జిగటగా ఉంది. మూతల్లేని చెత్త డబ్బా లు, మురుగు, ప్రమాణాల ప్రకారం లేని ఫ్రిడ్జిలు, కుళ్లిన వెజిటెబుల్స్, బొద్దింకలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ గుర్తించారు. బాహర్ బిర్యానీ కేఫ్లో మురుగు నీరు నిలిచి ఉంది, తుప్పు పట్టిన వంట సామగ్రి, ఫ్రిడ్జిలో అపరిశుభ్రత, చాక్లెట్ ఫ్లేవర్ సిరప్, గడువు ముగిసిన హాట్ పెప్పర్ సాస్, చికెన్ను నేరుగా ఫ్రిడ్జిలో ఉంచడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు