Connect with us

Telangana

కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు మంత్రి కొండా సురేఖ వివాదం

కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు మంత్రి కొండా సురేఖ వివాదం

తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో అగ్గిరాజేస్తుంటే.. మరోవైపు అదే కొండా సురేఖ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు యూట్యూబ్ ఛానెళ్లపై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టే రాజకీయం నడుస్తోంది. ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైంది. (అక్టోబర్ 03న) రోజు రాజధాని హైదరాబాద్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు  చేశారు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో.. స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఆమెకు స్వాగతం పలుకుతూ చేనేతలు ప్రత్యేకంగా తయారు చేసిన నూలుపోగు దండాను వేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను కొందరు బీఆర్ఎస్ మద్దతుదారులు.. సోషల్ మీడియాలో  అసభ్యకర పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులపై తీవ్రంగా స్పందించిన కొండా సురేఖ.. భావోద్వేగానికి లోనయ్యారు. భోజనం తినకుండా.. నిద్ర కూడా పోకుండా బాధపడుతూనే ఉన్నానని చెప్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక.. ఇదే అంశంపై కేసు పెట్టిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్ శ్రేణులపై తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ పోస్టులు పెట్టిన వారిని, అసభ్యకరంగా కామెంట్లు పెట్టిన ఎవ్వరినీ వదలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు.

ఒక తమ్ముడిగా.. కొండా సురేఖకు అండగా ఉంటానని.. వకీలుగా ట్రోలింగ్ చేసిన వారందరిపై కేసులు నమోదు చేపిస్తానని రఘునందన్ తెలిపారు. అసభ్యకర పోస్టులు పెట్టింది ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన రఘునందన్ రావు.. దుబ్బాక, సిద్దిపేట పోలీసులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. తాజాగా సైబర్ క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయటంతో.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

అక్టోబర్ 02న తాజాగా.. నాగచైతన్య, సమంతల విడాకుల గురించి మంత్రి కొండ సురేఖా తీవ్రమైన ఆరోపణలు చేయగా.. వాటిపై రాజకీయాల్లోనూ, టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చలు చెలరేగుతోంది. టాలీవుడ్‌ ప్రముఖులంతా కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నారు. అంతేగాక.. సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు.

Advertisement

 

Loading

Trending