Connect with us

Latest Updates

ఉత్తర్‌ప్రదేశ్‌: పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం కురిసింది.. సుమారు రూ.20 లక్షలు..

పెళ్లి అనేది జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. పెళ్లి ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎలాంటి వేడుకలు నిర్వహించాలి అనేది ప్రతి ఒక్కరికీ తమదైన ఆలోచనలు ఉంటాయి. అందుకోసం చాలా మంది భారీగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఇంకా డబ్బులు లేని వారైతే అప్పులు చేసి కూడా ఒక గ్రాండ్ వెడ్డింగ్ నిర్వహిస్తారు. పెళ్లిలో జరుగుతున్న ప్రతి ఘట్టం కూడా గ్రాండ్‌గా చేసుకోవాలని అనుకుంటారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో బంధువులు చేసిన హడావుడి ప్రస్తుతం నెట్టింట తెగ చర్చలు మొదలుపెట్టింది. కారణం, పెళ్లి బరాత్‌లో డబ్బులు వర్షంగా కురిపించడం, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగింది.

అఫ్జల్, అర్మాన్ అనే జంట తమ పెళ్లి తర్వాత ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ పెళ్లి బరాత్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథులు చేసిన హల్‌చల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బరాత్‌లో వారు డబ్బులు వెదజల్లడం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అబ్బురపరిచాయి. పెళ్లి ఊరేగింపులో వరుడి బంధువులు కొందరు ఇళ్లు, జేసీబీలపైకి ఎక్కి, అక్కడికి వచ్చిన వారిపై డబ్బుల వర్షం కురిపించారు.

 

ఈ డబ్బులు మొత్తం రూ.100, రూ.200, రూ.500 నోట్లుగా ఉండగా, సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆ వీడియోలో డబ్బులు తీయడానికి గ్రామస్థులు, పెళ్లికి హాజరైన వారు ఎగబడ్డారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ చర్యకు మద్దతు ఇస్తుంటే, మరికొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందించారు. కొంతమంది, ఈ డబ్బులను రోడ్లపై వెదజల్లే బదులుగా, నిరుపేదలకు సహాయం చేస్తే మంచిది అని సూచిస్తున్నారు. 20 లక్షలు అంటే ఆ డబ్బుతో నలుగురు పేద అమ్మాయిల పెళ్లిళ్లు చేయవచ్చని మరొకరు పేర్కొన్నారు. కొంతమంది ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, పన్ను కట్టాల్సి ఉందిగా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, యూపీ పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Advertisement

Loading

Trending