Devotional
Rare Temple: ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం

Rare Temple: ద్వాపరయుగం నాటి గజ లక్ష్మి ఆలయం.. ప్రసాదంగా నాణెం లభిస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం..
దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం. అయితే ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంది. కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.
సంపద పొందడానికి ప్రజలు లక్ష్మిదేవిని పూజిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. దేశవ్యాప్తంగా లక్ష్మీ దేవి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని ఆలయాలు ప్రధాన ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాంటి దేవాలయం మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ లక్ష్మీ దేవి తన వాహనమైన గుడ్లగూబపై ఉండదు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఏనుగుపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ విశ్వాసం ఏమిటో తెలుసుకుందాం
ఈ ఆలయం ఎక్కడ ఉంది మరియు దానిని ఎలా చేరుకోవచ్చు?
దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం. అయితే ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది అని నమ్ముతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంది. కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.
సనాతన ధర్మం మత విశ్వాసం అంటే ఏమిటి?
ఈ ఆలయం నమ్మకం ప్రకారం ద్వాపర యుగానికి సంబంధించినది. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం కోసం అడవుల్లో సంచరిస్తున్నప్పుడు కుంతీదేవి లక్ష్మీదేవిని పూజించడం ఎలా అని ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నదని చెబుతారు. తల్లి బాధను చూసిన పాండవులు సహాయం కోసం ఇంద్రుడిని ప్రార్థించారు. ఇంద్రుడు పాండవుల తపస్సుకు సంతోషించి తన వాహనాన్ని ఐరావతం పాండవుల వద్దకు పంపాడు. ఇంద్ర దేవుడి వాహనం పేరు ఏనుగు ఐరావతం. కుంతీదేవి లక్ష్మీదేవిని ఐరావతాన్ని పూజించారు. కుంతీ దేవి భక్తిని, పాండవులు తన పట్ల చూపిస్తున్న భక్తీకి, అంకితభావాన్ని చూసి తల్లి లక్ష్మీ చాలా సంతోషించింది. లక్ష్మీదేవి ఆశీస్సులు పాండవులకు లభించాయి. తర్వాత కాలక్రమంలో తమ రాజ్యాన్ని తిరిగి పొందారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు