Connect with us

Telangana

పుప్పాల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్

హైదరాబాద్ పుప్పాల్‌గూడలో గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు కూడా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో అపార్ట్‌మెంట్ లోని ఒక ప్లాట్ పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన వస్తువులు అంతం అయ్యాయి. బాధితుడి ప్రకారం దాదాపు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం అయిందట.

అయితే, బిల్డర్ నిబంధనలను ఉల్లంఘించి అపార్ట్‌మెంట్ నిర్మించాడు. ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు దారులు లేకపోవడంతో, మంటల్ని అదుపు చేసేందుకు వచ్చిన మూడు ఫైర్ ఇంజిన్లకు గంటల కొద్ది కష్టాలు ఎదురయ్యాయి. చివరకు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్ట్‌మెంట్ నిర్వాహకులను ఈ విషయం మీద పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలా అస్తవ్యస్తంగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించడమా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చెప్పటారు.

అలాగే, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు సజీవంగా కాలిపోయారు. ఆ రాత్రి 11.30 గంటల సమయంలో న్యూఓనేటల్ ఐసీయూలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే, రోగులు భయంతో పరుగులు పెట్టారు, దీంతో తొక్కిసలాట కూడా జరిగింది.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం ఇవ్వడానికి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ ఈ దురదృష్టకర ఘటనలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Loading

Advertisement

Trending