Connect with us

Entertainment

జానీ అంటే చాలు, జానీ మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదు అంటూ.. పూనమ్ కౌర్ ట్వీట్

జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఢీ కంటెస్టెంట్ మీద జానీ మాస్టర్ పలు మార్లు అత్యాచారం చేసిన ఘటన మీద ఇప్పుడు విచారణ జరుగుతోంది. అవుట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జానీ మాస్టర్ అకృత్యాలన్నీ కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. కేరవ్యాన్‌లో కూడా వదిలి పెట్టేవాడు కాదని, చాలా సార్లు లైంగికంగా వేధించాడని, కొట్టేవాడని, ఒప్పుకోక పోతే సెట్స్ మీదే బూతులు తిట్టేవాడని, అభ్యంతరకరంగా తాకేవాడంటూ ఇలా ఆరోపణలు చేసింది.

దీనిపై జానీ మాస్టర్ ఇంత వరకు స్పందించలేదు. దీంతో జానీ మాస్టర్ వ్యవహారం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. జానీ మాస్టర్ ఎదుర్కొంటున్న ఈ ఆరోపణల కారణంగా.. పార్టీకి దూరంగా ఉండాల్సిందని జన సేన అధిష్టానం ఆదేశించింది. దీంతో పొలిటికల్‌గా, సినీ కెరీర్ పరంగా జానీ మాస్టర్‌కు ఇక ఎదురు దెబ్బలు తప్పవనిపిస్తోంది. చూస్తుంటే జానీ మాస్టర్ కెరీర్ ఇక్కడితోనే క్లోజ్ అయ్యేలా ఉంది. ఒక వేళ ఈ కేసులో జానీ మాస్టర్ దోషి అని తేలితే.. కఠిన శిక్షలు పడేలా ఉన్నాయి.

జానీ మాస్టర్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అయితే జానీ మాస్టర్‌ను ఏకేస్తున్నారు. జన సేన పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. జానీ మాస్టర్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక చివరకు జన సేన అయితే జానీని దూరం పెట్టేసింది.

తాజాగా పూనమ్ కౌర్ ఈ ఘటన మీద స్పందించింది. జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదు.. మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని ట్వీట్ వేసింది. దీంతో పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్ కాసాగింది. అందరూ పూనమ్ ట్వీట్‌కు మద్దతు తెలుపుతున్నారు.

Loading

Advertisement

Trending