Connect with us

Entertainment

Bigg Boss 8 Telugu: బిరియాని పెట్టి మడతెట్టేశాడు బిగ్‌బాస్‌..

ఈ సీజన్ 8లో ఏంటో కానీ ఇప్పటివరకూ బిగ్‌బాస్ ఎప్పుడూ చూసినా మాడు ముఖం వేసుకొని అలుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అభయ్ అన్ని సార్లు తిట్టినా సైలెంట్‌గా విని.. అన్నీ రాసుకొని మరీ తర్వాత వార్నింగ్‌లు ఇచ్చాడు. అదేదో మొదటిసారి తిట్టినప్పుడే ఒక వార్నింగ్ ఇస్తే అయిపోయేది కదా అని ఎలిమినేట్ అయ్యాక అభయ్ కూడా అన్నాడు. అయితే ఈ సీజన్‌లో తొలిసారి బిగ్‌బాస్ కాస్త మూడ్ మార్చాడబ్బా. ఈరోజు జరిగిన టాస్కుల్లో అమ్మాయిలతో మాంచి రొమాంటిక్ జోకులు వేశాడయ్యో. తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.

తొలి టాస్కులో అదరగొట్టిందిగా
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్‌లో భాగంగా ‘బాల్‌ను పట్టు టవర్‌లో పెట్టు’ అనే టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్ దీని ప్రకారం 10 నిమిషాల సమయంలో ఐదు బాల్స్‌ను ఓ స్టిక్స్‌పై బ్యాలెన్స్ చేస్తూ టవర్లో వేయాలి.. ముందుగా ఎవరు వేస్తే వాళ్లు విన్నర్.. రెండూ టీమ్‌లూ వేయలేకపోతే ఇద్దరూ ఓడిపోయినట్లే అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ టాస్కు కోసం కాంతార క్లాన్ నుంచి ఆదిత్య, ప్రేరణ, నబీల్, నైనిక ఆడారు. సీత సంచాలక్‌గా వ్యవహరించింది. శక్తి టీమ్ నుంచి అందరూ ఆడారు.

అయితే ఈ టాస్కులో సీత టీమ్ అదరగొట్టేసింది. 9 నిమిషాల 46 సెకన్లలోనే ఐదు బాల్స్ వేసి గెలిచింది. దీంతో ప్రైజ్ మనీలో రూ.లక్ష యాడ్ చేశాడు బిగ్‌బాస్. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నంబర్ 12ను పీకేశాడు.

మణికంఠ ఔట్
అయితే టాస్కు అయిపోయిన తర్వాత శక్తి టీమ్‌కి ఓ షాకిచ్చాడు బిగ్‌బాస్. మీరు మొదటి ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.. మీ క్లాన్ నుంచి ఛాలెంజెస్‌కి అనర్హుడని ఫీలయ్యే ఒక మెంబర్‌ని తొలగించండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో శక్తి టీమ్ ఎవరినీ తీయాలో డిసైడ్ చేసేందుకు చర్చించుకుంది.

అయితే యష్మీ, సోనియా సహా అందరూ మణికంఠను తీసేయాలంటూ తమ అభిప్రాయం చెప్పారు. దీనికి ముందు వ్యతిరేకించిన మణికంఠ తర్వాత తన నిర్ణయం చెప్పాడు. నేనే ఈ గేమ్ ఆడకూడదనుకుంటున్నా.. నా మెంటల్ స్ట్రెంథ్‌ను రీప్లేస్ చేసే స్ట్రెంథ్ సోనియా దగ్గర ఉంది.. అలానే ఫిజికల్ స్థ్రెంథ్ పృథ్వీ దగ్గర ఉంది.. కనుక నేనే వెనక్కి జరుగుతున్నా.. కానీ తరువాతి టాస్కులు గెలవకపోతే మాత్రం నామినేషన్లో మీ అందరికీ వేస్తా.. అంటూ మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా మణికంఠ తప్పుకోవడంతో ఇక ఈ టాస్కుల్లో పాల్గొనే అర్హత కోల్పోయాడు.

Advertisement

ఇక తర్వాత ‘ఈట్ ఇట్ టూ బీట్ ఇట్’ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా రెండూ టీమ్‌ల ముందు రెండు మహా థాలీ (విందు భోజనం) పెట్టాడు బిగ్‌బాస్. మీరు మహాథాలీని పూర్తిగా తినాల్సి ఉంటుంది.. ఆ థాలీని 40 నిమిషాల్లో పూరి చేయాలి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఈ టాస్కు కోసం శక్తి టీమ్ నుంచి సోనియా.. కాంతార నుంచి నబీల్ వచ్చారు.

ఇద్దరూ కొంచెం తినేసరికే పని అయిపోయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హౌస్‌లో ఫుడ్ కోసం కొట్టుకునే స్థాయిలో కంటెస్టెంట్లను తయారు చేసిన బిగ్‌బాస్.. ఇప్పుడు వాళ్ల ముందే విందు భోజనం పెట్టి చూస్తుండే శిక్ష వేశాడు. సోనియా, నబీల్ తినలేక చాలురా బాబు అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తే ఫుడ్ చూస్తూ నోరూరిపోతున్నా కంట్రోల్ చేసుకున్నారు మిగిలిన కంటెస్టెంట్లు. అయితే ఇంతలో బిగ్‌బాస్ విష్ణుప్రియను ఓ కొశ్చన్ అడిగాడు. విష్ణుప్రియ ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు ఆకలేస్తుందా అని అడిగితే అవును బిగ్‌బాస్ అంటూ విష్ణు అంది. అయితే చూసి ఆనందిచ్చు.. అంటూ కౌంటర్ వేశాడు బిగ్‌బాస్. ఇంకాసేపటికి విష్ణుప్రియ వాళ్లని ఎంకరేజ్ చేస్తూ ఓ పాట పాడండి.. అంటూ బిగ్‌బాస్ అడిగాడు.

ఇక తినడం వీళ్ల వల్ల అయ్యేలా లేదని తెలిసి కావాలంటే మీ టీమ్‌ల నుంచి చెరొక సభ్యుడ్ని తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అటు యష్మీ, ఇటు ఆదిత్య వెళ్లారు. అయితే వీళ్లు తినే సమయంలో సోనియా, నబీల్ చేత ఎక్కాలు.. యష్మీ చేత ఓ పాట కూడా పాడించాడు బిగ్‌బాస్. చూస్తుండగానే 40 నిమిషాలు అయిపోయాయి కానీ ఆ థాలీ మాత్రం పూర్తి కాలేదు. దీంతో రెండు టీమ్‌లు ఈ ఛాలెంజ్‌లో ఓడిపోయాయి. ఇక ఆశగా చూసిన మిగిలిన కంటెస్టెంట్లకి చివరిలో ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ మిగిలిన ఫుడ్‌ను టేస్ట్ చేయొచ్చు అని చెప్పగానే అందరూ ఆ ప్లేట మీద పడ్డారు.

Loading

Trending