Connect with us

Entertainment

నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్టు పరిగణించలేమంటూ ఆయన పోస్ట్ పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి, రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు. ‘‘ న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేం: సర్ విలియం గారో’’ అని పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో ‘‘ మీరు విన్నదంతా నమ్మవద్దు. ప్రతి కథకు ఎల్లప్పుడూ మూడు కోణాలు ఉంటాయి. మీరు చెప్పేది, వాళ్లు చెప్పేది, సత్యం: రాబర్ట్ ఇవాన్స్’’ అని నాగబాబు పేర్కొన్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ట్వీట్స్ చేయడంతో ఆయనను ఉద్దేశించేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లైంగిక దాడి ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ పక్కన పెట్టింది. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Loading

Trending