Entertainment
నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్ను ఉద్దేశించేనా?

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్టు పరిగణించలేమంటూ ఆయన పోస్ట్ పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి, రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు. ‘‘ న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేం: సర్ విలియం గారో’’ అని పేర్కొన్నారు.
మరో ట్వీట్లో ‘‘ మీరు విన్నదంతా నమ్మవద్దు. ప్రతి కథకు ఎల్లప్పుడూ మూడు కోణాలు ఉంటాయి. మీరు చెప్పేది, వాళ్లు చెప్పేది, సత్యం: రాబర్ట్ ఇవాన్స్’’ అని నాగబాబు పేర్కొన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ట్వీట్స్ చేయడంతో ఆయనను ఉద్దేశించేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లైంగిక దాడి ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ను జనసేన పార్టీ పక్కన పెట్టింది. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు