Connect with us

Entertainment

Day 4 : Big Boss 8 Highlights

మరోసారి Bigg Boss 8 Telugu updates తో వచ్చేసాను. అసలు Day 4 లో ఎం జరిగిందో మనం తెలుసుకుందాం..

బిగ్‌బాస్ నామినేషన్లు అంటే ఆడియన్స్‌కి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. ఎందుకంటే వీక్ మొత్తం ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ కంటే ఆ రోజు వచ్చే Hype ఏ వేరే లెవల్.

బిగ్‌బాస్ సీజన్ 7లో కూడా నామినేషన్లు కూడా అంతే హాటుహాటుగా సాగాయి.

కానీ సీజన్ 8లో నామినేషన్ల దెబ్బకి అక్కడున్న కంటెస్టెంట్లకే కాదు చూసే ఆడియన్స్‌కి కూడా నీరసం వచ్చేసింది.

అంతలా ఎమోషనల్‌గా సాగింది ఈరోజు ఎపిసోడ్‌. ముఖ్యంగా ఈరోజు ప్రోమోతోనే మణికంఠ అందరినీ ఏడిపించేశాడని అంతా అనుకున్నారు.

Advertisement

కానీ ఎపిసోడ్‌తో పోలిస్తే అది జుజుబీ అన్నట్లే ఉంది.

ఎందుకంటే అసలు గ్యాప్ లేకుండా కంటెస్టెంట్లు వెక్కివెక్కి ఏడ్చేలా చేశాడు మణికంఠ.

చివరికి ఆడియన్స్ కూడా రేయ్ ఆపరా ఆపరా అంటూ టీవీలు ముందు అరిచే రేంజ్‌లో Performance చేశాడు మణికంఠ.

అయితే వాటి గురించి ఏందో తెలుసుకుందా..

బిగ్‌బాస్ సీజన్ 8లో ఈరోజు కూడా నిన్నటి నామినేషన్ల ప్రక్రియను కంటిన్యూ చేశాడు బిగ్‌బాస్.

Advertisement

ముందుగా ఆదిత్య ఓం వచ్చి పృథ్వీని క్లీనింగ్ విషయంలో అలానే శేఖర్ బాషా లేజీగా ఉన్నాడంటూ నామినేట్ చేశాడు. ఇక వీరిలో పృథ్వీని సేవ్ చేసి బాషాను బుక్ చేశారు చీఫ్‌లు.

ఇక తర్వాత కిరాక్ సీత.. ప్రేరణ అన్న కొన్ని మాటలు నచ్చలేదంటూ తన మొదటి నామినేషన్ వేసింది.

తర్వాత కుక్కర్ విషయంలో బేబక్కను నామినేట్ చేసింది. ఇక వీరిలో ప్రేరణను సేవ్ చేసి.. బేబక్కను బుక్ చేసింది చీఫ్ నైనిక.

ఇక తర్వాత అభయ్.. మొదటిగా మణికంఠను నామినేట్ చేశాడు. నీకు సారీ చెబుదామని వచ్చిన ఆదిత్య అన్నపై నువ్వు కోపపడ్డావ్.. ఒకసారి అయితే ఒకే.. కానీ మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేశావ్ అంటూ తన పాయింట్ చెప్పాడు.

అలానే నువ్వు హైపర్ అవుతున్నావ్.. ఎమోషనల్‌గా హై ఉన్నావ్.. అంటూ అభయ్ అన్నాడు.

Advertisement

దీనికి నా బిహేవియర్ అలాంటిది అంటూ ఏదో కవర్ చేసుకోబోయాడు మణికంఠ. దీంతో ఎవడి ఫ్లాష్ బాగ్‌లు ఇక్కడ అవసరం లేదు.. ఇక్కడ గేమ్ గురించి, హౌస్‌లో ఉన్న తీరు గురించే మాట్లాడతామంటూ అభయ్ అన్నాడు.

దీనికి యష్మీ సహా కొంతమంది క్లాప్స్ కొట్టారు. దీంతో నేను అన్‌ఫిట్ అయితే నేనే వెళ్లిపోతా.. అంటూ చెప్పాడు మణికంఠ.

ఇక తన రెండో నామినేషన్ గా బేబక్కకి వేశాడు అభయ్. ఇక వీద్దరిలో మణికంఠ ను నామినేట్ చేసింది యష్మీ.

ఇక తర్వాత విష్ణుప్రియ.. శేఖర్ బాషా కాస్త లేజీగా ఉన్నారంటూ నామినేట్ చేసింది.

అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావంటూ సోనియాను నామినేట్ చేసింది. దీనికి కాసేపు సోనియా గొడవేసుకుంది.

Advertisement

ఇక తనతో వాదించి వేస్ట్ అనుకున్న విష్ణు సర్లే అని వదిలేసింది. ఇక వీరిలో శేఖర్‌‌ను నామినేట్ చేస్తూ యష్మీ డెసిషన్ తీసుకుంది.

ఇక ఆ తర్వాత అసలు కథ మొదలైంది. మణికంఠ పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు.. గొడవ పెట్టుకునేంత కాన్సట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బావుండేది అంటూ నామినేట్ చేసింది ప్రేరణ..

అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెబుతుంటే మణికంఠ ట్యాప్ ఇప్పడం మొదలుపెట్టాడు.

“నేను ఒక్కో పాయింట్‌కి ఆన్సర్ చేస్తా అండి.. నాకు అంత జ్ఞాపకశక్తి లేదండి.. నా పేరామీటర్ అయిపోయింది.. 7వ తరగతి నుంచి నేను నానా కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను..

Stepfather చేత అవమానాలు పడ్డా.. అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నా.. నా భార్య దూరమైంది.. నా కూతుర్ని దూరం చేస్తుంది..” అంటూ ఏదేదో మాట్లాడాడు మణికంఠ.

Advertisement

మీకు నా గురించి ఏం తెలుసని క్లాప్స్ కొడుతున్నారు.. అంటూ తెగ ఏడ్చాడు మన మణికంఠ..

అసలే అమ్మాయిలు.. మన మణిబాబు ఈ రేంజ్‌లో చెప్పేసరికి ఒక్కొక్కరూ ట్యాప్ ఇప్పేశారు. ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు.

ముఖ్యంగా చీఫ్‌ యష్మీ అయితే సీట్లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేసింది. మరి ఇప్పుడైనా ఓపెన్ అయ్యారు కదా ఇక నుంచి అయినా మాతో ఫ్రెండ్ షిప్ చేయండి అంటూ ప్రేరణ అంటే మణికంఠ మరో డైలాగ్ కొట్టాడు.

“నేను ఎవరనీ నమ్మలేను.. మనుషుల మీద, మానవత్వం మీదే నాకు నమ్మకం పోయింది” అంటూ ఏడుస్తూనే ఉన్నాడు మణికంఠ.

ఇక మనోడిన్ని లేడీస్ అంతా కలసి కాసేపు ఓదార్చారు.

Advertisement

ఇక మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. లాంచింగ్ ఎపిసోడ్ అయిన రోజు తనలో ఫెమినిటీ (అంటే ఆడతనం, సున్నితత్వం) ఉందంటూ విష్ణుప్రియ చెప్పడం తనకి నచ్చలేదని.. దాని వల్ల తనని బయట అందరూ ట్రోల్ చేసే అవకాశం ఉందంటూ మణికంఠ చెప్పాడు.

ఇక ఈ విషయంలో విష్ణుప్రియ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

కానీ నిన్ను చెక్ చేయడానికే ఈ 3 days నీతో క్లోజ్‌గా ఉన్నా అంటూ మణికంఠ చెప్పడంతో విష్ణుప్రియా ఎమోషనల్ అయిపోయింది.

నువ్వు జెన్యూన్ అనుకున్నా కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావ్.. ఓకే అంటూ ఏడ్చింది విష్ణుప్రియా.

ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ.

Advertisement

వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే “ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్.. ఓ వచ్చి ఏడ్చేసి.. దాన్ని నుంచి సింపథీ తెచ్చేసుకొని.. పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావ్” అంటూ ఫైర్ అయ్యాడు శేఖర్ బాషా.

ఇక వీరిద్దరిలో శేఖర్ బాషాను సేవ్ చేసి విష్ణుప్రియా ను నామినేట్ చేసింది యష్మీ.

ఇక పృథ్వీ బేబక్కను మొదటిగా నామినేట్ చేయగా తర్వాత మణికంఠను చేశాడు. నాకు పిరికివాళ్లు నచ్చరు.. దేనికైనా ఇలా ఏడ్చే వాళ్లు అసలుకే నచ్చరు.. నువ్వు సింపథీ గేమ్ ఆడుతున్నావ్.. నువ్వు ఓ నెగెటివ్ పర్సన్.. అంటూ నామినేట్ చేశాడు పృథ్వీ.

ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక.

మొత్తంగా ఈ వారం నామినేట్ అయిన సభ్యులు సోనియా, బేబక్క, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ.

Advertisement

ఇంతటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది.

ఇక బయటికి వచ్చిన తర్వాత కూడా మణికంఠ తన పెర్ఫార్మన్స్ మొదలుపెట్టాడు. చూస్తూ సగం జీవితం అయిపోయింది.. మార్చుకోవాలన్నా మార్చుకోలేను అంటూ ఏదేదో ఒంటరిగా మాట్లాడుకున్నాడు.

ఇంతలో నిఖిల్, యష్మీ, సీత వచ్చి మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ మనోడు అసలు ఆపనే లేదు.

“నాకు దిక్కు లేదబ్బా.. నా వల్ల కావడం లేదు.. నా బాడీ నాకు సహకరించడం లేదు.. బ్రెయిన్‌లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి.. ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన తర్వాత నన్ను అందరూ నెగెటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తే.. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు..

బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు.. కానీ మొత్తం అంతా బయటికొచ్చేసింది నిఖిల్.. ఐయామ్ డన్ ఇంతకంటే ట్రాన్స్‌పరెంట్‌గా నేన ఉండలేను..” అంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టేశాడు మణికంఠ.

Advertisement

వార్నీ ఇది విగ్గా అన్నట్లు అందరూ షాక్ అయ్యారు.

ఇక ఇలా కాదని మణికంఠను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. అప్పుడు కూడా మణికంఠ అసలు తగ్గేదేలే అన్నట్లు ఏడుస్తూనే ఉన్నాడు.

“నా భార్య నాకు కావాలి.. నా అత్తమామల దగ్గర గౌరవం కావాలి.. నా Stepfather నాకు మళ్లీ కావాలి.. నా పిల్ల నాకు కావాలి.. నా మీద కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది..” అంటూ ఏడుస్తూనే ఉన్నాడు.

దీనికి ఏం చెప్పాలో తెలియక “మీరు అనుకున్నది సాధించడానికే మీరు ఇక్కడికి వచ్చారు.. ఇంత త్వరగా మీ ధైర్యాన్ని కోల్పోతే ఎలా.. కొన్నిసార్లు మన బలాన్ని మనమే గ్రహించలేకపోతాం..

నువ్వు ఇక్కడి వరకూ వచ్చావంటే నువ్వు బలవంతుడివి కాబట్టే.. నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే నువ్వు నిన్ను నమ్మాలి..” అంటూ బిగ్‌బాస్ దైర్యం చెప్పాడు.

Advertisement

అయితే ఇది జరుగుతున్న సమయంలో బయట ప్రేరణతో మణికంఠ గురించి శేఖర్ బాషా చెప్పిన ఓ మాట భలే సూట్ అయింది.

“ఇప్పడు మీరు యుద్ధానికి వెళ్లారు..అవతలోడు బాణాలు వేస్తుంటే ఏయ్ నువ్వు వెయ్యడానికి లేదు నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావా నువ్వు..” అంటూ శేఖర్ వేసిన ఒక్క డైలాగ్ మణికంఠ గేమ్ ప్లాన్ మొత్తాన్ని చెప్పేసిందన్నమాట.

అయినా ఇంటరెస్టింగ్ గా చూద్దామంటే ఇలా నీరసం ఎపిసోడ్ చూడాల్సి వచ్చింది. మరి Next ఎపిసోడ్ లో ఎం జరగబోతుందో చూడాలి..

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending