Connect with us

Business

ఆ ఒక్క కారణంతో కాసులు కురిపించిన టాటా స్టాక్.. ఒక్కరోజే 20 శాతం జంప్..

ఆ ఒక్క కారణంతో కాసులు కురిపించిన టాటా స్టాక్.. ఒక్కరోజే 20 శాతం జంప్
ప్రముఖ టెలికామ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ తేజాస్ నెట్వర్క్స్ లిమిటెడ్ స్టాక్ ఇవాళ అదరగొట్టింది.
టాటా గ్రూప్‌కి చెందిన స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే ఏకంగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ తాకింది. తమ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. ఇందుకు ఓ ప్రధాన కారణం ఉంది. అదే ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కోసం ఎగబడేలా చేసింది. ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.

ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే ఈ కంపెనీ స్టాక్ 20 శాతం మేర లాభపడి అప్పర్ సర్క్యూట్ తాకింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ భారీ లాభాలు ప్రకటించిన క్రమంలో ఈ షేరు భారీ ర్యాలీ చేపట్టింది. ఈ కంపెనీ స్టాక్ గత ఏడాదిలో 47 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది.

మిడ్ క్యాప్ కేటగిరికి టెలికామ్ ఉత్పత్తుల రంగానికి చెందిన తేజాస్ నెట్వర్క్స్ లిమిటెడ్ (Tejas Networks Limited) తమ వాటాదారులపై కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 13 కోట్లు నష్టాలు చూపించగా.. ఇప్పుడు భారీగా లాభాల్లోకి రావడం గమనార్హం. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 275 కోట్లుగా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 2811 కోట్లుగా నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 396 కోట్లుతో పోలిస్తే 6 రేట్లు పెరిగింది. దీంతో కంపెనీ పన్నుల అనంతర లాభం భారీగా నమోదైంది.
ఆరంభంలోనే కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఏకంగా 20 శాతం లాభంతో ట్రేడింగ్ మొదలు పెట్టింది. 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ తాకింది. చివరకు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 11.31 శాతం లాభంతో రూ.1322 వద్ద ముగిసింది. ఈ క్రమంలో తేజాస్ నెట్వర్క్స్ లిమిటెడ్ షేరును కొనుగోలు చేసేందుకు మదుపరులు ఎగబడ్డారు. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 1495 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 651.25 వద్ద ఉంది.

ఐదేళ్ల క్రితం ఇందులో రూ.1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.17.77 లక్షలకుపైగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 22,540 కోట్లుగా ఉంది. తేజాస్ నెట్వర్క్స్ లిమిటెడ్ కంపెనీ దేశంలోని దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌కి చెందిన కంపెనీ. గత ఒక వారంలో ఈ షేరు 8 శాతం మేర లాభాలు ఇచ్చింది. గత నెల రోజుల్లో 5 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో సుమారు 43 శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది. గత ఏడాదిలో ఈ షేరు 57 శాతం పెరిగింది. గత ఐదు సంవత్సరాల్లో 1677 శాతం మేర రిటర్న్స్ ఇందించింది. ఈ సంస్థ ప్రధానంగా టెలికాం సెక్టార్‌కి సంబంధించిన ఉత్పత్తులు వైర్ లైన్, వైర్ లెస్ నెట్వర్కింగ్ డిజైన్ వంటివి తయారు చేస్తుంది. బెంగళూరు కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending