Business
80వేల పైకి సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లలో ‘ట్రంప్’ జోష్.. ఐటీ కంపెనీలకు భారీ లాభాలు!

80వేల పైకి సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లలో ‘ట్రంప్‘ జోష్.. ఐటీ కంపెనీలకు భారీ లాభాలు!
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైపోయింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రంప్ జోష్ కనిపిస్తోంది. ప్రధానంగా దేశీయ ఐటీ కంపెనీల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో మళ్లీ సెన్సెక్స్ 80వేల పైకి చేరింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు భారీ లాభపడ్డాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్ దాటింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షగా విజయం. ఈ క్రమంలో సూచీలు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 700 పాయింట్ల మేర లాభపడింది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 24,400 పాయింట్లను దాటి ట్రేడవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారైన క్రమంలో ప్రధానంగా దేశీయ ఐటీ కంపెనీల్లో జోష్ కనిపిస్తోంది. ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు మంచి లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3 శాతం లాభపడింది.
డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఇది ఐటీ స్టాక్స్కి ఉత్సాహం ఇచ్చినట్లు స్టాక్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మన దేశ ఐటీ కంపెనీలకు ప్రధానంగా అమెరికా కరెన్సీలోనే ఆదాయం వస్తుంది. డాలర్ బలపడితే అది కంపెనీలకు ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఈ కారణంగానే ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొంచెం చూస్తే.. ట్రంప్ గెలిస్తే చైనాపై మళ్లీ ట్యాక్సులు పెంచుతారనే భయంతో చైనా మార్కెట్లు మరియు హాంకాంగ్ మార్కెట్లు తగ్గుతున్నాయి. మధ్యాహ్నం 1.26 గంటలకు సెన్సెక్స్ 802 పాయింట్ల లాభంతో 80,279 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ సూచీ 240 పాయింట్ల లాభంతో 24,453 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీల షేర్లు మంచి లాభాల్లో ఉన్నాయి. అదే సమయంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, హిందుస్తాన్ యూనిలివర్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్ వంటి కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 74.44 డాలర్ల వద్ద ఉంది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు