Connect with us

Entertainment

Bigg Boss 8 Telugu Day 92 Updates

బిగ్‌బాస్ టుడే ఎపిసోడ్‌లో ఆటపాటలు ముగిసిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్స్‌లో చివరిగా మిగిలిన పృథ్వీ, విష్ణు యాక్షన్ రూమ్‌కి రావాలని నాగార్జున అన్నారు. అక్కడ రెండు అక్వేరియాలు ఉన్నాయ్. మొదట నెం. 1 అని రాసిన లిక్విడ్‌ను అక్వేరియంలో వేయాలని చెప్పారు. అది వేయగానే నీళ్లు ఎల్లో రంగులోకి మారాయి. తర్వాత నెం. 2 లిక్విడ్‌ను వేయమని చెప్పారు. అది వేసిన తర్వాత నీళ్లు రెడ్ రంగులోకి మారితే ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ప్రకటించారు.

అందరూ ఊహించినట్లే, పృథ్వీ అక్వేరియంలోని నీళ్లు రెడ్‌గా మారగా, విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా మారాయి. దీంతో పృథ్వీ, యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున తెలిపారు.

విష్ణు వెంటనే తనను సేవ్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. నాకు ఓటేసి నన్ను ఆదరించిన వారందరికీ థాంక్యూ, మీరు నన్ను నిజంగా ప్రేమించారు అంటూ విష్ణు భావోద్వేగంగా చెప్పింది.

అటు పృథ్వీ అందరికీ హగ్గు ఇచ్చి బయటకు వెళ్లే ముందు గుడ్‌బై చెప్పాడు. నిఖిల్, నబీల్, ప్రేరణ హగ్గు ఇవ్వడంతోపాటు పృథ్వీ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. గేటు దగ్గరికి వెళ్లిన తర్వాత విష్ణు పృథ్వీకి మరోసారి హగ్గు ఇచ్చి ఐయామ్ సారీ అంటూ చెప్పింది.

పృథ్వీ వెళ్లిపోయిన వెంటనే విష్ణు కన్నీరు పెట్టుకుంటూ “ఐ మిస్ యూ, యూ ఆర్ ఏ గ్రేట్ మ్యాన్” అంటూ పృథ్వీ గురించి అరచింది.

Advertisement

స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే నాగార్జున పృథ్వీని “ఎలిమినేషన్ గురించి ఊహించావా?” అని అడిగారు. దీనికి పృథ్వీ “లేదు సార్, కానీ ఐయామ్ ఫైన్.. నో రిగ్రెట్స్” అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత పృథ్వీ జర్నీ వీడియోను ప్లే చేశారు. ఈ వీడియోలో పృథ్వీ హౌస్‌లోకి అడుగుపెట్టిన దశ నుంచి జరగిన ముఖ్యమైన సంఘటనలను చూపించారు.

విష్ణుప్రియతో ఉన్న లవ్ ట్రాక్‌ని ప్రత్యేకంగా పాటలతో సరికొత్తగా ఎడిట్ చేసి చూపించారు. అలాగే సోనియా, యష్మీ, నిఖిల్, నబీల్‌తో పృథ్వీ బాండింగ్‌ను హైలైట్ చేశారు. వీడియోలో తన తండ్రి ఫోటో గురించి “ఇదొక్కటే ఉంది” అని పృథ్వీ చెప్పిన దృశ్యాన్ని చూసి అతను భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే ఫ్యామిలీ వీక్‌లో తన తల్లి హౌస్‌లోకి వచ్చినప్పుడు జరిగిన ఎమోషనల్ సన్నివేశాలు అతనికి మరింత ఎమోషనల్ చేశాయి.

పృథ్వీ జర్నీ వీడియో చూసిన తర్వాత ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. పృథ్వీ ఏడవడం చూసి నాగార్జున కూడా కాస్త ఆశ్చర్యపోయారు. హౌస్‌లో ఇప్పటివరకు పృథ్వీ ఒక్కసారి మాత్రమే ఏడ్చాడు, అది మెగా చీఫ్ అవకాశం కోల్పోయినప్పుడు. కానీ స్టేజ్‌పై జరిగిన ఈ సందర్భంలో పృథ్వీ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు.

పృథ్వీ వెళ్లేముందు నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ముగ్గురు సూపర్ హిట్లు, ముగ్గురు సూపర్ ఫ్లాపులను చెప్పమన్నారు. పృథ్వీ మొదట నిఖిల్‌కి సూపర్ హిట్ ఇచ్చాడు. టాస్కులు, ఇంట్లో ప్రవర్తన అన్నీ బాగున్నాయంటూ నిఖిల్‌ను ప్రశంసించాడు. ఆ తర్వాత నబీల్‌కి సూపర్ హిట్ ఇచ్చి, టాస్కులు, నామినేషన్లలో నబీల్‌కి ఉన్న ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇదే నిర్ణయం అని చెప్పాడు. చివరగా విష్ణుప్రియని సూపర్ హిట్‌గా పేర్కొన్నాడు. ఆమె సరదాగా ఉండడం, తనతో కలిసి హౌస్‌లో ఎన్నో మంచి సందర్భాలను పంచుకోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

సూపర్ ఫ్లాపుల విషయానికి వస్తే, మొదట రోహిణిని ఫ్లాప్‌గా పేర్కొన్నాడు. మీరు నామినేషన్లలోకి రావడం చాలా అవసరం, ఆడియన్స్ మీ గురించి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇప్పటివరకు మీరు ఒక్కసారే నామినేషన్లలోకి వచ్చారు కాబట్టి మీకు సూపర్ ఫ్లాప్ ఇస్తున్నాను అన్నాడు. తర్వాత అవినాష్‌ని ఫ్లాప్‌గా ప్రకటించి, నామినేషన్లలో ఎక్కువగా ఉండి జనాల్లోకి వెళ్లి తమని నిరూపించుకోవాలని అన్నాడు.

Advertisement

చివరిగా, అందరికీ “బాగా ఆడండి” అని సూచించి, తాను నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియకు ఓటు వేస్తానని చెప్పాడు. అందరికీ నాలుగు ఓట్లు ఎలా వేస్తావని నాగార్జున అడిగితే, “సార్, నేను నాలుగు మొబైల్స్ తీసుకొని ఓట్లు వేస్తాను” అని సరదాగా చెప్పి అందరినీ నవ్వించాడు.

తన ఎలిమినేషన్ అనంతరం పృథ్వీ స్టేజ్‌పైకి వచ్చి, ఇంతకాలం తనకు ఓటు వేసిన ఆడియన్స్‌కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. “నేను 13 వారం వరకు హౌస్‌లో ఉంటానని ఊహించలేదు. మీ ప్రేమ కారణంగానే 10 సార్లు నామినేషన్‌కి వచ్చినా ప్రతి సారి సేవ్ అయ్యాను. ఐ లవ్యూ!” అంటూ తన మనసులోని కృతజ్ఞతలను తెలియజేశాడు. అనంతరం పృథ్వీ “బై బై” చెప్పి స్టేజ్‌ను వీడాడు.

తర్వాత నాగార్జున ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ సీజన్‌లో విన్నర్‌కి ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీతో కూడిన గొప్ప బహుమతులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వాటిలో మారుతీ సుజుకీ యొక్క కొత్త డిజైన్లో అలరించే డాజ్లింగ్ డిజైర్ కారు కూడా ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో కంటెస్టెంట్లలో ఉత్సాహం పెరిగింది.

నాగార్జున అందరినీ మరింత ఆసక్తి కలిగించడానికి “ట్విస్ట్‌లు, టర్న్‌లు పూర్తయ్యాయనుకుంటున్నారా? ఇంకా చాలా మిగిలి ఉన్నాయి” అన్నారు. గోల్డెన్ టికెట్ సాధించిన ముగ్గురికి బిగ్‌బాస్ నుంచి ఓ ప్రత్యేక ఆఫర్ రాబోతోందని చెప్పారు. “ఆ ఆఫర్ గురించి మీకు బిగ్‌బాస్ స్వయంగా చెబుతారు,” అంటూ నాగార్జున సస్పెన్స్‌లో ముగించారు.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending