Andhra Pradesh
అమెరికా సెకెండ్ లేడీగా తెలుగు అమ్మాయి.. చంద్రబాబు ఆసక్తికర పోస్ట్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో, ఆయన సహయోధుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన మహిళ. భర్త వైస్-ప్రెసిడెంట్ కావడం వల్ల ఆమె అమెరికాకు ద్వితీయ మహిళాగా ఆమె గుర్తింపు పొందుతారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జేడీ వాన్స్కు శుభాకాంక్షలు చెబుతూ.. ఉషా చిలుకూరి అమెరికా సెకెండ్ లేడీ కావడం తెలుగువారికి ఎంతో గర్వకారణమని, ఇది చరిత్రాత్మక సంఘటన అని కొనియాడారు. తెలుగు వారసత్వం కలిగిన మహిళ అమెరికాలో తొలిసారి సెకెండ్ లేడీగా కావడం గురించి ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
“అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన జేడీ వాన్స్కు నా అభినందనలు.” ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉషా వాన్స్ అమెరికా సెకెండ్ లేడీగా మారడం ఒక చారిత్రాత్మక ఘట్టం. “తెలుగు వారసత్వం ఉన్న మహిళ ఈ ఘనత సాధించడం గర్వకారణం” అని చంద్రబాబు నాయుడు అభినందించారు. అంతకు ముందు అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్నకు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ట్రంప్ విజయం వలన భారత్ మరియు అమెరికా సంబంధాలు మరింత బలపడతాయన్నారు.
ఉషా చిలుకూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉయ్యూరు మండలంలోని సాయిపురం గ్రామం నుండి ఉన్నారు.” ఆమె తల్లిదండ్రులు 1980లో అమెరికాకు వెళ్లారు.” ఆమె తల్లి లక్ష్మి శాన్డియాగో వర్సిటీలో మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. తండ్రి చిలుకూరి రాధాకృష్ణ ఏరోస్పేస్ ఇంజినీర్. వీరికి ఇద్దరు సంతానం కాగా, వారిలో ఉష ఒకరు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు