Andhra Pradesh
జాకీలతో పెద్ద భవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.. ఆ ఖర్చుతో కొత్తది కట్టేయొచ్చని అనుకుంటున్నారు!

జాకీలతో పెద్ద భవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.. ఆ ఖర్చుతో కొత్తది కట్టేయొచ్చని అనుకుంటున్నారు!
రాజమహేంద్రవరం భవనం జాకీలతో కదిలించారు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాన్ని ఇటీవల వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆక్రమణల్ని తొలగించాలని ఆదేశించడంతో.. ఓ భవనం యజమానికి నోటీసులు ఇచ్చారు. ఆయ భవనాన్ని కూల్చడానికి యజమాని ఇష్టపడలేదు. తనకు నెల రోజులు సమయం కావాలని అడిగాడు. తక్షణమే బీహార్ నుండి ఒక బృందాన్ని పిలిచి, జాకీల సహాయంతో ఆ ఇంటిని కదిలించేందుకు చర్యలు ప్రారంభించారు.
వరదల్లో ముంపులో చిక్కుకున్న ఇంటిని జాకీల సాయంతో కదిలించారు. కలెక్టర్ ఆదేశాలతో యజమానికి నోటీసులు పంపగా, ఆ ఇంటిని కూల్చడానికి ఇష్టపడక, జాకీల సాయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలో వరదల సమయంలో పలు ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. దీంతో రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ఆవకాలువ ఆక్రమణలు తొలగించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
వెంటనే హుకుంపేట సిద్దార్థ స్కూల్ యజమాని మూర్తికి పంచాయతీ అధికారులు నోటీసులు పంపించారు. తనకు ఒక నెల సమయం కావాలని, ఈ సమయంలో భవనాన్ని తొలగించే చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ భవనాన్ని కూల్చేందుకు మూర్తి ఇష్టపడలేదు.. దానిని ముందుకు జరిపేందుకు ఏకంగా రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఈ ఇంటిని రాజమహేంద్రవరం గ్రామీణం హుకుంపేట పంచాయతీ పరిధిలో నేషనల్ హైవేకు దగ్గర.. 100 అడుగుల పొడవు 34 అడుగుల వెడల్పుతో 35 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. జాకీల సహాయంతో ఈ భవనాన్ని కొద్దికొద్దిగా పైకి లేపి ముందుకు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ కోసం బీహార్ నుంచి నైపుణ్యం కలిగిన 40 మంది కార్మికులను తీసుకొచ్చారు. వీరంతా భవనాన్ని ముందుకు జరిపేందుకు మూడు నెలలు పడుతాయని భవన యజమాని మూర్తి అంటున్నారు. స్టక్చరల్ ఇంజనీరుని సంప్రదించి ఈ పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.
గుంతల రోడ్లతో గత ఐదు సంవత్సరాలు నరకం చూసిన ప్రజలకు వాటి నుంచి బయటపడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద శనివారం జిల్లాలో మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. జిల్లాలో 145 కి.మీ. మేర ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు రూ.10.29 కోట్లు వెచ్చించనున్నారు. విజయనగరం జిల్లా ఎస్. కోటలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పనులు ప్రారంభిస్తారు.
జిల్లా పరిధిలో 1,300 కి.మీ మేర ఆర్ అండ్ బీ రహదారులు ఉన్నాయని, వీటిలో 1,070 కి.మీ మరమ్మతులు చేయాల్సి ఉందని ఎస్.ఈ జి.కంఠు తెలిపారు. వీటిలో ప్రస్తుతం 145 కి.మీ మేర రూ.10.29 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో టెండర్లు పూర్తయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. మరో 195 కి.మీ మేర మరమ్మతు పనులకు రూ.9.40కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఆమోదించారని..త్వరలో నిధులు విడుదల చేస్తారని చెప్పారు.
తునిలో తుని–కత్తిపూడి రోడ్డులో కుమ్మరిలోవ వద్ద చేయనున్నారు . ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం–శరభవరం రోడ్డులో చేస్తారు. జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట–కాట్రావులపల్లి రోడ్డులో 3 కి.మీ పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం పట్టణంలో గుర్రాల సెంటర్, సామర్లకోట రోడ్డు. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం రైల్వేగేటు డ్రెవర్స్ కాలనీ రహదారి. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పెనుగుదురు– రామచంద్రపురం రోడ్డులోను..కాకినాడ నగర నియోజకవర్గంలో అన్నమ్మఘాటీ కూడలి వద్ద రహదారికి మరమ్మతులు చేయనున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేలా ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు