Andhra Pradesh
“ఏపీ వరద బాధితులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, రేమాండ్ పెద్ద మొత్తంలో విరాళం..

“ఏపీ వరద బాధితులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, రేమాండ్ పెద్ద మొత్తంలో విరాళం..ఇది చూసి ఆశ్చర్యం కలిగించే మొత్తంలో చెక్కు.”
ఆంధ్రప్రదేశ్ రేమండ్ గ్రూప్ రూ. 2 కోట్ల విరాళం: ఏపీ లో వరద బాధితులకు సహాయం చేయటానికి దాతలు ముందుకు వస్తున్నారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన కొంతమంది తమ విరాళాలను చెక్కుల రూపంలో ఇచ్చారు. రేమాండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా రూ.2 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి చెక్కులను సీఎంకు ఇచ్చారు. గంగవరపు విజయ్భాస్కర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రూ.65లక్షలు ఇచ్చారు.. రాష్ట్రీయ సేవా సమితి రూ.50లక్షలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు విరాళాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని దాతలు ప్రజల్ని కాపాడటానికి ముందుకు వస్తున్నారు.. పలు కంపెనీలు, కొన్ని వ్యక్తులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేస్తున్నారు. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా రూ. 2 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున సంస్థ జోనల్ హెడ్ రితేష్కుమార్, జోనల్ డిప్యూటీ మేనేజర్ సుధాకర్ రూ. 1 కోటి చెక్కులను చంద్రబాబుకు ఇచ్చారు. అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గంగవరపు విజయ్భాస్కర్ నేతృత్వంలో రూ. 65 లక్షలు ఇచ్చారు. రాష్ట్రీయ సేవా సమితి రూ.50 లక్షల చెక్కుల్ని వేర్వేరుగా ముఖ్యమంత్రికి అందజేశారు.
అలాగే ఏపీ లో వరద బాధితుల సహాయార్థం 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయంకా, డైరెక్టర్ ఆసిస్ గోయంకా రూ. 1 కోటి విరాళం చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ సౌకర్యాన్ని ఉపయోగించి.. దాదాపు రూ. 300 కోట్ల పెట్టుబడితో ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలను విస్తరించబోతుంది. మరికొందరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కులు అందించారు.
- మద్దిపట్ల కృష్ణా, ఎన్ఆర్ఐ రూ.10 లక్షలు.
- థామస్య రూ.1 లక్షా 75 వేలు.
- కొర్రపాటి సురేంద్ర రూ.1 లక్షా 50 వేలు.
- తులసీ కృష్ణమూర్తి రూ.1 లక్షా 18 వేలు
- కె.రమేష్ రూ.1 లక్షా 116
- కె.నారాయణ రూ.1 లక్ష
- ఎస్ఎల్ఎన్ శాస్త్రి రూ.70 వేలు
- కోలా మన్మధరావు రూ.50 వేలు
- విజయవాడ పడమటలోని విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్ధులు రూ.50 వేలు
- నరేంద్ర రూ.50 వేలు
- రాజశేఖర్ రూ.50 వేలు
- కోనేరు వెంకటరామ్ రూ.25 వేలు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.
తన ఇష్టమైన నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా కలిసిన ఓ విద్యార్థిని తీపి జ్ఞాపికను అందించింది. విజయవాడలోని విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్యకి చంద్రబాబుకు చాలా అభిమానం. తన చేతితో గీసిన బాబుగారి చిత్రాన్ని తీసుకుని సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసి ముగ్దుడైన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు