Andhra Pradesh
ఏపీలో యువతకు ఉచిత భోజనం, వసతి.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతం..

ఏపీలో యువతకు ఉచిత భోజనం, వసతి.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలోపు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈమేరకు ఒకేషనల్ ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణను అందిస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఈ మేరకు రాష్ట్రంలో శిక్షణ మొదలైంది. ఉచితంగా వసతి, భోజనంతో శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు కూడా చూయిస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేషనల్ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో ఏపీఎస్ఎస్డీసీ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) దీనిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు 1.10 కోట్ల మంది ఉండటంతో.. వారికి ఒకేషనల్ రంగంలో ఉపాధి కల్పించే పనిలో ఉంది.. ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ చేపట్టింది. వీరికి ప్రారంభ వేతనం కొంత తక్కువగా ఉండటంతో.. ఈ అవకాశాలను పట్టించుకోవడం లేదు. దీంతో నిపుణుల కొరత ఏర్పడింది.
ప్రతినెలా వేలసంఖ్యలో కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫ్లంబర్, ఏసీ రిపేరర్ వంటి ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. లింక్డిన్, నౌకరీ వంటి జాబ్ పోర్టల్ల నివేదికల ప్రకారం దీన్ని గుర్తించారు. కానీ, క్లరికల్ ఉద్యోగాలతో పోలిస్తే ప్రారంభంలో వేతనాలు కొంచెం తక్కువగా ఉన్నా, అనుభవం పెరిగే కొద్దీ మంచి వేతనాలు వస్తున్నాయి.
ఈ ఉద్యోగాల్లో ప్రారంభంలో టెక్నీషియన్కు రూ.15-18వేల జీతం వస్తోంది. వీరు రెండేళ్ల తర్వాత సూపర్వైజర్ అయితే రూ.30-40వేలు వస్తున్నాయి. వీరు భవిష్యత్తులో సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఆలోచన నుంచి వచ్చిందే అర్బన్ కంపెనీ. విదేశాల్లో ఈ కంపెనీలకు ఇప్పుడు డిమాండ్ ఉంది. అలాగే డీటీపీ, ప్రకటనలు, డిజిటల్ వ్యాపారంలో అవకాశాలకు శిక్షణ కూడా ఇస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రెండు సంస్థలు ఈ ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తున్నాయి. రివల్యూషనరీ అనే సంస్థ శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కూడా ఇస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి రివల్యూషనరీ సంస్థ విజయవాడలో ఎలక్ట్రిషియన్ శిక్షణ అందిస్తోంది. ఇదే సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరులోనూ రెండు వారాల్లో శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ ఒకేషనల్ ఉద్యోగాల శిక్షణ 2-3 వారాలు ఉంటుంది.. శిక్షణ తీసుకునేవారికి లేటెస్ట్ టూల్కిట్పై శిక్షణ ఇచ్చి, కిట్ను అందిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. ఈ సంస్థ ఏడాదికి ఈ రంగంలో 7వేల ఉద్యోగాలు కల్పిస్తుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.
మరోవైపు శ్రీసైనేజెస్ సంస్థ నాన్ గ్రాడ్యుయేట్లకు స్థానికంగా అవకాశాలు కల్పించేందుకు శిక్షణ ఇస్తోంది. విజయవాడ వరద ప్రాంతాల్లోని నిరుద్యోగుల కోసం శిక్షణ మొదలుపెట్టారు. డీటీపీ, సైనేజ్ ఫ్యాబ్రికేషన్ వంటి ఉద్యోగాల కోసం ఈ శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 30మందికి శిక్షణ అందిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న సైనేజ్ కంపెనీలతో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. వీరికి అక్కడ ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తంగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు